విశాఖలో ‘కంచె’ ఆడియో విడుదల

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కంచె.’ బాలీవుడ్ లో ఇటివలే గబ్బర్ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.

కంచె ఆడియోను విశాఖపట్నంలో ఆగష్టు 17న వినాయక చవితి సందర్భంగా పోర్ట్ స్టేడియంలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ పడుతోంది. ప్రముఖ అతిధుల సమక్షంలో చాలా అట్టహాసంగా ఈ చిత్రం ఆడియో కార్యక్రమం జరగనుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశ యుద్ధ విమానాలు విశాఖపట్నం మీద దాడి చేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉండవచ్చును. కంచె చిత్రం కూడా రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యం లో సాగుతుండటంతో ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించేందుకు చిత్ర బృందం నిర్ణయించింది.

ఈ చిత్రంలోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా అధ్భుతంగా రచించారని నిర్మాతలు రాజీవ్ రెడ్ది మరియు జాగర్లమూడి సాయి బాబు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కంచె చిత్రం విడుదల అవుతుందని, ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలుస్తుందని దర్శకులు క్రిష్ జాగర్లమూడి తెలిపారు. కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు…మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటుంది. ఈ నేపధ్యంలో 1940 సం.లో సాగే ఒక కథను దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు.

భారీ వ్యయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్నఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టను మరింత పెంచేదిగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ‘కంచె’ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి మరియు సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close