టీడీపీ కండువా కప్పితే చాలన్నట్లుగా నేతల వలస !

తెలుగుదేశం పార్టీలోకి వలసలు క్రమంగా పెరిగిపోతున్నాయి. టిక్కెట్ పై ఆశ లేని వాళ్లు కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు వస్తున్నారు. ఎలాంటి హామీలు ఉండవని.. పార్టీలో చేరేందుకు వస్తే ఓకేనని చెబుతున్నా వచ్చేస్తున్నారు. రాత్రి ఫోన్ చేసి ఉదయం వచ్చి కండువా కప్పించుకుంటున్నారు. ఏపీలో అన్ని జిల్లాల నుంచి ఇలాంటి చేరికలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఆఫీస్ సందడిగా మారుతోంది.

ఇవాళ ఒక్క రోజే దాడి వీరభద్రరావు కుటుంబంతో సహా టీడీపీలో చేరారు. విజయసాయిరెడ్డి బావమరిది .. రాయచోటికి చెందిన ద్వారకనాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. ఆయన గత ఎన్నికకు ముందు కూడా టీడీపీతో చర్చలు జరిపారు. కానీ విజయసాయిరెడ్డి మంతనాలు జరిపి ఆపేశారు. ఈ సారి ఆయన ఎవరి మాట వినలేదు. టీడీపీలో చేరిన తర్వాత.. విజయసాయిరెడ్డిని కూడా టీడీపీలోకి ఆహ్వానించే హక్కు ఉందన్నారు. బహుశా.. ఈ సారి విజయసాయిరెడ్డి కూడా సేఫ్టీ కోసం అయినా తన వాళ్లు అక్కడ ఉండాలన్నట్లుగా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఇక ఆశ్చర్యకరంగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కూడా చంద్రబాబుతో కండువా కప్పించుకున్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు. తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అక్కడ్నుంచి కాంగ్రెస్, వైసీపీలోకి వెళ్లారు. జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన టీడీపీలో చేరిపోయారు. ఎలాంటి టిక్కెట్, పదవి ఆఫర్ లేకపోయినా ఆయన పార్టీలో చేరడానికి వచ్చేశారు.

ముందు ముందు టీడీపీలో ఆశ్చర్యకరమైన చేరికలు ఉంటాయని.. భావిస్తున్నారు. ఇక నుంచి ఎన్నికల వరకూ చేరికల ప్రోగ్రాంలు ఎక్కువగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close