జనవరిలో టీడీపీలోకి సీమ నేతల చేరికల వెల్లువ !

తెలుగుదేశం పార్టీలోని జనవరిలో రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున చేరికల వెల్లువ ఉండే అవకాశం ఉంది ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ హైకమాండ్ తో టచ్‌లోకి వచ్చారని చెబుున్నారు. వారంతా మొదటి నుంచి వైసీపీ అెధినేత జగన్ కోసం గత పదిహేనేళ్లుగా పని చేస్తున్న వారే . జగన్ కోసం ఎంతగా పని చేసిన తన స్వార్థం కోసం తమను బలి చేయబోతున్నారని అనేక మందికి అర్థం అయింది. అందుకే టీడీపీ అధినేతతో టచ్ లోకి వచ్చారని చెబుతన్నారు.

అదే సమయంలో ప్రభుత్వం మారడం ఖాయమన్న అభిప్రాయం ఉండటంతో తర్వాత వచ్చే ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడితే రాజకీయంగా, ఆర్థికంగా కుంగిపోతామని భయపడుతున్నారు ప్రభుత్వ ప్రభుత్వం టీడీపీ నేతలపై ప్రయోగించిన ఘోరమైన వేధింపులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారని.. దానికి బలయ్యేది తామేనన్న భయం రాయలసీమ నేతల్లో వ్యక్తమవుతోంది. ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇదే అంశంపై కంగారు పడుున్నారు. ఇప్పటికీ వైసీపీలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని పైగా టీడీపీకి టార్గెట్ అవుతామని ద్వితీయ శ్రేణి నేతలు కూడా భావిస్తున్నారు.

అందుకే పెద్దఎత్తున నేతల చేరికలు ప్రారంభమయ్యాయి. కేవలం టిక్కెట్లు ఆశించే వారు కాకుండా… వైసీపీలో ఉండటం దండగ అనుకున్నవారు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు. రాయలసీమ నుంచి చేరేవారిలో ఎక్కువ మంది టిక్కెట్లు ఆశించే వారు కాదని.. పొటెన్షియల్ లీడర్లకు మాత్రం టిక్కెట్ ఇస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close