బీజేపీ ఆఫర్‌ను కోమటిరెడ్డి పరిశీలిస్తున్నారట..!

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక రోజు కాంగ్రెస్ పార్టీకి..మరో రోజు బీజేపీకి తన వాయిస్ అప్పగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి రోజు.. సీఎల్పీలో హడావుడి చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రెండో రోజు బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. టీఆర్ఎస్‌ను ఓడించేది బీజేపీనేనని మళ్లీ స్టేట్ మెంట్ ఇచ్చారు. అంతే కాదు.. బీజేపీలోకి రమ్మని సంప్రదింపులు జరుగుతున్నాయని.. నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేయాలని.. కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని .. తాను బీజేపీ నుంచి పోటీచేస్తే జానారెడ్డికి మూడో స్థానమే వస్తుందని జోస్యం చెప్పారు. సాగర్‌లో బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెదుకుతోంది.

కానీ… ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెడుతుందని ఎవరూ అనుకోవడం లేదు. అయితే ఆర్థికంగా బలవంతుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థి అవుతారన్న చర్చ మాత్రం జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి.. పోటీ చేయించే అంత వ్యూహం బీజేపీ అమలు చేస్తుందా.. అన్న సందేహం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీలోనే టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంది. నేతలు పోటీలు పడి ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డిని బతిమిలాడి.. పార్టీలోకి తీసుకుని టిక్కెట్ ఇస్తే.. ఆ నేతలు కలిసి పని చేస్తారా అన్నది బీజేపీ వర్గాలకు ఉన్న అనుమానం.

మొత్తానికి రాజగోపాల్ రెడ్డి నోట బీజేపీ మాట రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఢిల్లీ పెద్దల్ని కలిసి వచ్చాడు. అయితే బీజేపీలో తానే సీఎం అభ్యర్థి చెప్పుకోవడంతో వారు పక్కన పెట్టేశారు. అప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాట పాడారు. సోదరుడు కోమటిరెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకపోతే బీజేపీలోకి పోతానని బెదిరింపులు కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ సాగర్ ఎన్నికలకు ముందు ప్రారంభించారు. ఇలాంటి నిలకడ లేని నేతను బీజేపీ సీరియస్‌గా ఆహ్వానిస్తుందా … పోటీకి పెడుతుందా..అన్నది ఆ పార్టీలోనే కొంత మంది నేతలకు ఉన్న సందేహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close