“టీఎస్‌ ఐపాస్‌”ను దేశం దృష్టికి తీసుకెళ్లిన కేటీఆర్..!

తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్న మంత్రి కేటీఆర్…పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే టీఎస్‌ఐపాస్ విధానాన్ని దేశం దృష్టిలో పడేలా చేస్తున్నారు. ఈ విధానాన్ని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మెచ్చుకున్నారు. రాష్ట్రాల పరిశ్రమల శాఖల మంత్రులతో వర్చవల్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌ ఐ-పాస్‌ విధానానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అందిస్తే.. దానిపై అధ్యయనం చేస్తామన్నారు. టీఎస్‌ ఐ-పాస్‌ గురించి కేటీఆర్.. కేంద్రమంత్రికి వివరించారు. సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌, డీమ్డ్‌ అప్రూవల్స్‌ వంటి విధానాలతో సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలుస్తున్నామని కేటీఆర్‌ కేంద్రమంత్రికి చెప్పారు.

కరోనా వైరస్.. కొత్త అవకాశాలను సృష్టించిందని కేటీఆర్ నమ్ముతున్నారు. అ అవకాశాలను అంది పుచ్చుకోవడానికి వర్చువల్ పద్దతిలోనే ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ.. తెలంగాణ ప్రత్యేకతల్ని వివరిస్తున్నారు. తాజాగా సీఐఐ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. హైదరాబాద్‌ను స్మార్ట్‌ ఆఫ్‌ క్యాపిటల్‌గా తయారు చేసే ఉద్దేశంతో ఐదు సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. అలాగే కరోనా చికిత్సకు వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌, రెమ్‌డెసివిర్‌, ఫాపిరావిర్‌ ఔషధాల్లో 35-40 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని.. హ్యూమన్‌ వ్యాక్సిన్లకు కేంద్రంగా ఉందని మేకిన్‌ తెలంగాణ విజయాలను వివరించారు.

చైనా నుంచి తరలిపోయి ఇతర దేశాల్లో ప్లాంట్లు పెట్టాలనుకుంటున్న సంస్థను తెలంగాణకు రప్పించేందుకు కేటీఆర్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. కొన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయి కూడా. కేటీఆర్.. పూర్తి స్థాయిలో… ప్రభుత్వ బాధ్యతలు మొత్తం చూసుకుంటున్నప్పటికీ..ఎక్కడా ఒత్తిడికి గురి కాకుండా… అన్నింటినీ సమన్వయం చేసుకుంటున్నారు. పెట్టుడులను ఆకర్షించి.. పారిశ్రామికంగా తెలంగాణను మంచి స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close