ఎగిరి గంతేసిన లాలూ కుటుంబం

బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయంతో నితీశ్ కుమార్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 29 మంది సభ్యులతో కూడిన మంత్రిమండలిని ఆయన ఏర్పాటుచేసుకున్నారు. వైభవంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో `కూటమిలోని అందరికీ సమన్యాయ’మన్న ఫార్ములాతో నితీశ్ మంత్రిపదవులు కట్టబెట్టారు. లాలూప్రసాద్ యాదవ్ ఆయన కుటుంబసభ్యులు (భార్య, ఏడుగురు కుమార్తెలు, అల్లుళ్లు) మిగతావారికంటే ఎక్కువ ఆనందపడ్డారు. కుమారులిద్దరికీ కీలకపదవులు లభించేలా పెద్దాయన రాజకీయం బాగానే పనిచేసింది.దటీజ్ లాలూ… ఆయన ఇద్దరు కుమారులు (తేజశ్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్) మంత్రివర్గంలో కీలక స్థానాలు దక్కించుకున్నారు. అంతేకాదు, లాలూ ఇద్దరి కుమారుల్లో ఒకరికి (తేజశ్వి) డిప్యూటీ సీఎంహోదా లభించింది. వీరిద్దరు ఆర్ జెడీ తరఫున తొలిసారిగా గెలిచారు. డిప్యూటీ సీఎం హోదా సాధారణంగా సీనియర్ కి అప్పగిస్తారు. అయితే మహాకూటమి ఈక్వేషన్స్ ఆధారంగా ఈ కుర్రాడికి డిప్యూటీ హోదా దక్కింది.

నితీశ్ సహా, జెడియు నుంచి 12మంది, ఆర్ జెడీ నుంచి 12మంది, కాంగ్రెస్ నుంచి నలుగురికి మంత్రి పదవులు లభించాయి. లాలూ కుమారుడు తేజశ్వి (26)కు డిప్యూటీ సీఎంహోదాతో పాటుగా రహదారుల నిర్మాణం, భవన నిర్మాణాలకు సంబంధించిన శాఖ అప్పగించారు. బిహార్ ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడంలో ఈ శాఖ చాలాకీలకమైనది. కాగా, లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ కి ఆరోగ్య శాఖ అప్పగించారు. గతంలో ఎలాంటి అనుభవం లేని కుర్రాళ్లకు కీలకశాఖలు ఇవ్వడంలో నితీశ్ సాహసమే చేశారనిపిస్తోంది. ఎన్నికల్లో లాలూ తన పార్టీని జెడియుతో పాటుగా మహాకూటమిని విజయవంతంగా నడిపించడంలో కీలకపాత్ర పోషించినందుకు లాలూకి బాగానే గిట్టుబాటైంది. దీంతో ఆయన ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఆర్ జెడీ కి చెందిన మరో నాయకుడు అబ్దుల్ బారి సిద్ధిఖ్ ఆర్థికశాఖ అందుకున్నారు. హోమ్, సమాచార,ప్రచార శాఖ, సాధారణ పరిపాలన వంటి విధులు ముఖ్యమంత్రి స్వయంగా చూసుకుంటారు.

లాలూ ప్రసాద్ లాగానే, మరో పక్క రాహుల్ గాంధీ కూడా సంబరపడ్డారు. ప్రమాణస్వీకారోత్సవం చివర్లో ఆయన హాజరయ్యారు. ఢిల్లీ నుంచి రావడంలో జాప్యం జరిగింది.మహాకూటమిలో చేరడం వల్ల కాంగ్రెస్ కూడా బాగానే లబ్దిపొందింది. కాంగ్రెస్ లీడర్ అశోక్ చౌదరికి విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. నితీశ్ ప్రమాణస్వీకారం చేశాక , తేజశ్వీ ప్రమాణం చేశారు. రాజకీయాల్లో అతిరథమహారధులైనవారెందరో ఈ ప్రమాణోత్సవానికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి బదులుగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయన లూలూ పక్కన కూర్చుని అప్పుడప్పుడు మాటలు పంచుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ నీ, ఆయన కుమారుడు- యూపీ సీఎం అయిన అఖిలేష్ యాదవ్ కి ఆహ్వానాలు అందినప్పటికీ, ఈ ఉత్సవానికి సమాజ్ వాదీ ఎం.పీ తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ హాజరయ్యారు. ఈయన లాలూ ప్రసాద్ యాదవ్ కి అల్లుడు. లాలూ తన కూతుర్లు, అల్లుళ్లతో వివిఐపీ సీట్లలో కూర్చుని తేజశ్వీ, తేజ్ ప్రతాప్ ప్రమాణస్వీకార కార్యక్రమాలను అమితానందంతో తిలకించారు.

మంత్రిపదవులు కట్టబెట్టడంలో నితీశ్ ఓ చక్కటి ఫార్ములాను అనుసరించారు. ప్రతి ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒకరికి పదవి వచ్చేలా ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహాకూటమి ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. బిహార్ ఎన్నికలకు ముందే ప్రధాని మోదీ భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడంతో రాష్ట్రాన్ని మరింతగా నితీశ్ అండ్ హిజ్ టీమ్ కృషిచేస్తుందని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close