ఇండియ‌న్ 2… మ‌ద్రాస్ హైకోర్టు తీర్పు

క‌మ‌ల్ హాస‌న్ – శంక‌ర్ ల సినిమా `ఇండియ‌న్ 2` వివాదాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వివిధ కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో `ఇండియ‌న్ 2`ని ప‌క్క‌న పెట్టి, మ‌రో రెండు సినిమాల ప‌నుల్ని మొద‌లెట్టాడు శంక‌ర్‌. ఈ విష‌య‌మై `ఇండియ‌న్ 2` నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్.. కోర్టు కెక్కింది. `ఇండియన్ 2` పూర్తి కాకుండా మ‌రో సినిమా మొద‌లెట్ట‌కుండా తీర్పు ఇవ్వాల‌ని మ‌ద్రాస్ కోర్టుని కోరింది. దీనిపై న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. `ఈ విష‌యాన్ని మీరే ప‌రిష్క‌రించుకోండి` అని తేల్చింది. త‌దుప‌రి తీర్పుని ఈనెల 28కి వాయిదా వేసింది. దాంతో బంతి మ‌ళ్లీ నిర్మాత – ద‌ర్శ‌కుడి మ‌ధ్య ఆగిన‌ట్టైంది.

ఇది వ‌ర‌కే శంక‌ర్ – లైకాల మ‌ధ్య చాలా చ‌ర్చ‌లు జ‌రిగాయి. వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి క‌మ‌ల్ చాలా ప్ర‌య‌త్నించాడు. కానీ అవేమీ ఫ‌లితాల్ని ఇవ్వ‌లేక‌పోయాయి. శంక‌ర్ ఇప్ప‌టికీ `ఇండియ‌న్ 2` పూర్తి చేస్తాన‌నే చెబుతున్నాడు. మ‌రో 20 శాతం చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే బాకీ ఉంద‌ని, త్వ‌ర‌లో ఆ భాగాన్ని పూర్తి చేస్తాన‌ని కోర్టుకు తెలిపాడు. ఇప్పుడు నిర్మాత‌లే ముందుకు రావాలి. ఈ సినిమాకి ప్ర‌ధాన మైన స‌మస్య బ‌డ్జెట్. ఆ సినిమాకి అనుకున్న బ‌డ్జెట్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు నిర్మాత‌లు ఒక్క రూపాయి కూడా ఈ సినిమాపై ఖ‌ర్చు పెట్ట‌డానికి సిద్ధంగా లేరు. ముందు అనుకున్న ఎగ్రిమెంట్ ప్ర‌కారం… ఈ సినిమాని పూర్తి చేసే బాధ్య‌త ద‌ర్శ‌కుడిదే అన్న‌ది వాళ్ల వాద‌న‌. దీనిపైనే కోర్టు త‌న త‌దుప‌రి తీర్పు చెప్ప‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close