మునుగోడులో ఉనికి చాటితేనే కాంగ్రెస్‌కు భవిష్యత్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. అలా రాజీనామా చేసినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించగానే ఇలా .. వెంటనే ఉపఎన్నికల కమిటీని నియమిస్తూ ప్రకటన చేశారు. సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి, బలరాంనాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, ఎరావత్రి అనిల్ కుమార్‌లను సభ్యులుగా నియమించారు. మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన స్ట్రాటజీ, ప్రచారం వంటి వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది.

రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పూర్తయిన వెంటనే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌తో సమావేశం అయ్యారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి పోతారన్న సమాచారం పక్కాగా ఉండంతో ముందుగా తదుపరి ఏం చేయాలన్నదానిపై వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. అందుకే అలా రాజీనామా చేయగానే ఇలా ఉపఎన్నికల సన్నాహాలు ప్రారంభించాల్సిందేనని నిర్ణయించారు. అ ప్రకారం వెంటనే స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేశారు.

ఐదో తేదీన మునుగోడులో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం ద్వారా పార్టీ క్యాడర్ ఎవరూ రాజగోపాల్ రెడ్డితో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా లేరని చెబుతున్నారు. పాల్వాయి స్రవంతిని కొద్ది రోజుల కిందట రేవంత్ రెడ్డి పిలిపించి మాట్లాడారు. అప్పట్నుంచి ఆమె కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపితేనే ఆ పార్టీ పరిస్థితిపై వచ్చే ఎన్నికల్లో కాస్త ఆశలు పెట్టుకోవచ్చు. లేకపోతే కష్టమే. అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముందు నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close