తెదేపా, వైకాపా మధ్యలో ముద్రగడ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ముద్రగడ పద్మనాభం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అయితే పైకి అలాగా కనిపిస్తున్నా తెదేపా, వైకాపాల మధ్య ఆయన నలిగిపోతున్నారని చెప్పవచ్చును. ఆయనను వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే రెచ్చగొట్టి ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తుంటే, ఆవిధంగా ఆయన పట్ల అనుచితంగా మాట్లాడుతూ కాపులని, వారి కోసం పోరాడుతున్న ఆయనని ప్రభుత్వం అవమానిస్తోందని వైకాపా నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. కానీ తెదేపా చేస్తున్న ఆ ఆరోపణలకి భయపడో లేకపోతే తమ పార్టీకి బీసీలను దూరమవుతారనే భయంతోనో వైకాపా ఆయనకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేకపోతోంది. ఆ కారణంగానే తెదేపా నేతలు ఆయనపై విమర్శలు గుప్పించగలుగుతున్నారు.

జగన్ ప్రోద్భలంతోనే ఆయన కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను ఆయన గట్టిగానే త్రిప్పి కొడుతున్నారు. కానీ ఆయనకు మద్దతుగా కాపు నేతలు ఎవరూ మాట్లాడటానికి ముందుకు రాకపోవడం గమనార్హం. అంటే వారు కూడా ఆయన రాజకీయ దుర్దేశ్యంతోనే ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారని భావిస్తున్నట్లున్నారని అనుకోవలసి ఉంటుంది. లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు అందరూ తమ నాయకుడిపై అంత తీవ్రమయిన విమర్శలు చేస్తుంటే వారు చూస్తూ ఊరుకోరు కదా?

కాపుల కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ముద్రగడకి అటు తన కాపు కులస్థుల నుండి మద్దతు లభించక, వైకాపా నుంచి కూడా మద్దతు లభించకపోవడంతో ఆయన దేశ ముదురు తెదేపా నేతలతో ఒంటరి పోరాటం చేయవలసి వస్తోంది. జగన్ ప్రోద్భలంతో ముందుకు దూకినందుకు బహుశః ఇప్పటికే ఆయన పశ్చాతప పడుతున్నారేమో కూడా. కానీ ప్రభుత్వానికి మళ్ళీ కొత్త డెడ్ లైన్ ఇచ్చేసినందున వెనుతిరిగే మార్గాన్ని ఆయనే స్వయంగా మూసేసుకొన్నట్లయింది. అలాగని దైర్యం చేసి ముందుకే వెళ్ళినా ఆయనకు ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఒకవేళ మళ్ళీ నిరాహార దీక్షకు కూర్చొని దానిని మళ్ళీ అర్దాంతరంగా ముగించినా లేదా పోలీసులే దానిని భగ్నం చేసినా ఆయనే నవ్వులపాలవుతారు.

జగన్ ప్రోద్భలంతోనే ఆయన మళ్ళీ ప్రభుత్వంతో పోరాటానికి సిద్దం అవుతున్నట్లు తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమనుకొంటే, ఒకవైపు తెదేపా నేతల నుండి ఈ రకమయిన విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్రగడపై, మరోపక్క జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా (పోరాటం కొనసాగించమని) తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండి ఉండవచ్చును. ఈ పరిణామాలు చూస్తుంటే ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆడుకొంటున్న రాజకీయ చదరంగంలో పావుగా మారిపోయినట్లు కనబడుతున్నారు. తాను ఎవరి కోసం ఉద్యమిస్తున్నారో వారి నమ్మకాన్ని పొంది, వారు తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేసి ఉండి ఉంటే, ఆయనకి ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close