ఏపిలో స్థానికత సమస్య పరిష్కారం అయ్యింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన స్థానికత ప్రతిపాదించినకి కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులను విజయవాడ లేదా గుంటూరు తరలింపుకి అవరోధంగా మారిన ఈ స్థానికత సమస్యని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం ఆమోదించి కేంద్రప్రభుత్వానికి పంపించింది. దాని ప్రకారం 2017, జూన్ 2లోగా ఆంధ్రప్రదేశ్ వచ్చి స్థిరపడేవారికి, వారి పిల్లలకి కూడా స్థానికులుగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా వారు కూడా స్థానిక ప్రజలతో సమానంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది కనుక రాష్ట్రపతి ఆమోదం పొందడం ఇంక లాంఛనప్రాయమేనని భావించవచ్చును. ఇది అమలులోకి వచ్చినట్లయితే హైదరాబాద్ లో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులు, వారి పిల్లల భవిష్యత్ గురించి ఇంక ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు కనుక విజయవాడ తరలిరావచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close