ప్రస్తుతం జనతా గ్యారేజ్ ఫీవర్నడుస్తోంది. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ఎన్టీఆర్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు? అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. అయితే ఎన్టీఆర్ మాత్రం.. ‘వాట్ నెక్ట్స్’ అనే ఆలోచనలో పడిపోయాడట. జనతా గ్యారేజ్ రిజల్ట్పై ఎన్టీఆర్ ఓ ఫైనల్ థాట్కి వచ్చేసినట్టు టాక్. అందుకే రిజల్ట్పై ఆలోచించకుండా తదుపరి సినిమా ప్రణాళికలు ప్రారంభించేశాడని తెలుస్తోంది. వక్కంతం వంశీ ఎన్టీఆర్ కోసం ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. ఎన్టీఆర్ కూడా వక్కంతంకి మాటిచ్చాడు. అందుకే… అక్టోబరులో వక్కంతం సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నాడట. అయితే ఈ విషయంలతో పూరి జగన్నాథ్ నుంచి ఒత్తిడి ఎదురవుతోందని టాక్.
టెంపర్ తరవాత మళ్లీ ఎన్టీఆర్ తో పనిచేయాలని చూస్తున్నాడు పూరి. టెంపర్ 2 కథని ఆల్రెడీ వినిపించడం, దానికి ఎన్టీఆర్ ఓకే అనేయడం జరిగిపోయాయి. అయితే… జనతా గ్యారేజ్ అవ్వగానే ఈ సినిమా మొదలెట్టాలన్నది పూరి ఆలోచన. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం వంశీతోనే చేయాలని ఫిక్సయ్యాడట. అది పూరిని కాస్త ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. టెంపర్ 2 కథ నచ్చినప్పటికీ ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టాల్సివస్తోందని, అయితే తప్పకుండా ఆ సినిమా ఉంటుందని ఎన్టీఆర్ పూరికి మాటిచ్చాడట. అయితే.. పూరి మాత్రం ఎన్టీఆర్ని ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి కూడా వక్కంతం సినిమాని పక్కన పెడితే.. ఇక ఆ రచయిత మరో రెండేళ్ల వరకూ ఆగాల్సిందే.