అడ‌విలో.. రోడ్లు వేస్తున్న పుష్ష టీమ్‌

పుష్ష టీమ్ త‌న ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టింది. షూటింగుల కోసం స‌ర్వం సిద్ధం చేసుకుంటోంది. అట‌వీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. మారేడుమ‌ల్లి అడ‌వుల్లో ఈ సినిమా షూటింగ్ చేయాల‌ని భావించారు. అయితే.. క‌రోనా నేప‌థ్యంలో అక్క‌డకు వెళ్లి షూటింగ్ చేయ‌డం కుద‌ర‌ని ప‌ని అని, అడ‌వి సెట్టింగులు ఇక్క‌డే హైద‌రాబాద్‌లో వేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే వీటిని చిత్ర‌బృందం త్రోసిపుచ్చింది. క‌థ ప్ర‌కారం.. అడ‌వుల్లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుపుతార్ట‌. సెట్టింగులు వేసే అవ‌కాశం, అవ‌స‌రం ఈ క‌థ‌కు లేద‌ని తేల్చేశారు. ముందుగా అనుకున్న‌ట్టు మారేడు మ‌ల్లి అడ‌వుల్లోనే ఈ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. అక్క‌డ స‌హ‌జ‌మైన లొకేష‌న్ల‌లోనే స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తారు. కాక‌పోతే.. అడ‌విలో షూటింగుల‌కు అనుగుణంగా.. ర‌హ‌దార్లు బాగు చేస్తున్నారు. ఛేజింగులు చేయ‌డానికి అనువుగా.. రోడ్లు వేస్తున్నారు. సుమారు నాలుగు కిలోమీట‌ర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జ‌ర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఈ ప‌నుల‌న్నీ పూర్త‌య్యాక‌.. కొత్త షెడ్యూల్ వేసుకుని, దాని ప్ర‌కారం షూటింగు మొద‌లెడ‌తారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ – ర‌ష్మిక జంట‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close