భాజ‌పాలో చేరిన సైనా నెహ్వాల్… ఢిల్లీలో ప్ర‌చారం!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్టార్ కేంపెయినర్ల వేట‌లో ప‌డ్డ‌ట్టుంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఢిల్లీలో గెలుపును చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటోంది. అందుకే, ఏ ఒక్క అవకాశాన్ని వ‌దులుకోవ‌డం లేదు! దీన్లో భాగంగానే బాట్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తో ప్ర‌చారం చేయించే వ్యూహంలో ఉంది. ఈరోజు ఆమె భాజ‌పా తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అరుణ్ సింగ్ స‌మ‌క్షంలో ఆమె పార్టీలో చేరారు. ఆ త‌రువాత‌, అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో భేటీ అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయించే అంశ‌మై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

మీడియాతో మాట్లాడుతూ… భాజపా దేశం కోసం చాలా చేస్తోంద‌న్నారు సైనా. క్రీడాకారిణిగా తాను చాలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తుంటాన‌నీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా దేశం కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తుంటార‌న్నారు. ఆయ‌న‌తో క‌లిసి దేశం కోసం ఏదైనా చేయాల‌న్న‌ది త‌న ఆశ‌య‌మ‌న్నారు. ఆయ‌న నాయ‌క‌త్వం త‌న‌కు స్ఫూర్తిని ఇస్తూ ఉంటుంద‌న్నారు. ఖేలో ఇండియా లాంటి కార్య‌క్ర‌మాల‌తో క్రీడాకారుల‌కు కూడా ప్ర‌ధాని చాలా ప్రోత్సాహం అందిస్తున్నార‌న్నారు. దేశం కోసం ఎంతోమంది క్రీడాకారుల‌కు ఆడే అవ‌కాశం ద‌క్కుతోంద‌నీ, పెద్ద పెద్ద అకాడ‌మీల్లో ఛాన్సులు ల‌భిస్తున్నాయ‌న్నారు. త‌న‌కి రాజ‌కీయాలు కొత్త అనీ, ఇక్క‌డ చాలా నేర్చుకోవాల్సింది ఉంద‌న్నారు. త‌న‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉంద‌నీ, దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను తాను గ‌మ‌నిస్తూ ఉంటా అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సెలెబ్రిటీల‌తో భారీగానే ప్ర‌చారం ప్లాన్ చేస్తోంది. సైనాతో ప్ర‌చారం చేయించ‌డం ద్వారా ముఖ్యంగా యువ‌త‌ను ఆక‌ర్షించే అవ‌కాశం ఉంటుంద‌న్న‌ది భాజ‌పా విశ్వాసం. వాస్త‌వం మాట్లాడుకుంటే… సైనాకి ఒక క్రీడాకారిణిగా ఉన్న ఇమేజ్ వేరు… ఇప్పుడు రాజ‌కీయాలు ఆమెకు పూర్తిగా కొత్త‌. ఆమెని భాజపా నేతగా చూడటమూ ప్రజలకి ఇంకా కొత్త. ఢిల్లీలో రాజకీయ ప‌రిస్థితులు కూడా సరైనీకి మరీ కొత్త‌. అక్క‌డి ఎన్నిక‌ల్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ విధానాలు, కేజ్రీవాల్ పాల‌న మీద భాజ‌పా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెయ్యాలి. భాజ‌పా ఆధిప‌త్యంపై ఆమ్ ఆద్మీ పోరాటం చేస్తోంది. ఇవ‌న్నీ అర్థం చేసుకునే స‌రికి సైనాకి కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు. కాబ‌ట్టి, ప్ర‌స్తుతానికి ఆమె మోడీ విధానాలు న‌చ్చాయ‌ని మాత్ర‌మే ప్ర‌చారం చేయ‌గ‌ల‌రు. అంత‌కుమించి ఇప్పుడు ఆశించ‌లేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close