వైఎస్ వివేకా వర్థంతి రోజున సునీత రాజకీయ ప్రకటన !

వచ్చే ఎన్నికల్లో కడప నుంచి రసవత్తర రాజకీయం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ సునీత తన రాజకీయ ప్రకటన చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైఎస్ వివేకా వర్థంతి ఈ నెల పదిహేనో తేదీన. ఇందు కోసం పులివెందులలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ఆమె ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఆమె బుక్ చేసుకున్న ఓ ఫంక్షన్ హాలును క్యాన్సిల్ చేశారు. దీంతో కడపకు తన రాజకీయ ప్రకటనను మార్చుకున్నారు. కడప వేదికగా పదిహేనో తేదీన ఎన్నికల్లో పోటీపై సునీత కీలక ప్రకటన చేయనున్నారు.

ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సునీత.. .. తనకు ప్రజా మద్దతు కావాలని కోరారు. ప్రజా తీర్పు కావాలన్నారు. ఇందు కోసం ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నానని ఏ రూపంలో వెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీకా.. పార్లమెంట్ కా అన్నదానిపై స్పష్టతకు వచ్చారని.. పదిహేనో తేదీన ప్రకటిస్తారని భావిస్తున్నారు. పోటీ సునీత చేస్తారా.. ఆమె తల్లి చేస్తారా అన్నది కూడా ఆరోజే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వైఎస్ సునీత లేదా ఆమె తల్లి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి అంగీకారం తెలిపే అవకాశం కల్పించేందుకు ఆ పార్టీ రెడీగానే ఉంది. అయితే స్వతంత్రంగా పోటీ చేస్తే అన్ని పార్టీల మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినా..ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ఇతర పార్టీలు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండవు. అదే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే… అన్ని పార్టీలు మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి. ఎలా చూసినా ఈ సారి పులివెందుల అసెంబ్లీ, కడప లోక్‌సభలో కీలకమైన పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close