తెలంగాణలో ఎన్నికల విధులకు టీచర్లు దూరం..! ఎందుకిలా..?

తెలంగాణలో కరోనా కారణంగా పాఠశాలలు ప్రారంభించలేదు. చాలా కాలంగా ఉపాధ్యాయులు ఖాళీగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి. దీంతో పనులు ఉండే ఇతర శాఖల వారిని పక్కన పెట్టి ఎన్నికల విధులకు ఉపాధ్యాయుల్నే ఎక్కువగా ఉపయోగించుకుటారని అనుకున్నారు. సాధారణంగా ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులే కీలకం., కాస్త ఎక్కువగా అవగాహన ఉండేది వారికే. అందుకే వారికి కీలక బాధ్యతలు ఇస్తూ ఉంటారు. అనూహ్యంగా ఈ సారి ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నప్పటికీ.. వారికి విధులు కేటాయించకూడదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తున్న సిబ్బంది పాత్ర మరింత క్రియాశీలకంగా ఉంటుంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని… అందుకే వారికి విధులు అప్పగించడం మంచిది కాదన్న ఆలోచన.. అధికార పార్టీలో వచ్చిందని చెబుతున్నారు. అందుకే వారిని.. దూరంగా ఉంచాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా తెర ముందుకు వస్తున్నారు. తమకు ఎందుకు ఎన్నికల విధులు కేటాయించలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

వాస్తవానికి ఉపాధ్యాయులకే బోధనేతర పనులు చెప్పకూడదని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. అసలు బోధన పనే ఉండటం లేదు. వేరు పనులు కూడా లేకపోతే.. తమకు ఇబ్బంది అనుకున్నారేమో కానీ.,. ఎన్నికల విధులు నిర్వహించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. వారితో పని చేయించుకోవడానికి సిద్ధంగా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close