జయహో కేసీఆర్…

అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీపై ఎటువంటి ప్రకటన చేయకుండా రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను కూడా చాలా నిరాశపరిచారు. రాష్ట్ర ప్రజల ఆదరణ పొందుతున్న నరేంద్ర మోడీ ప్రసంగాన్ని విని పెదవి విరిచిన రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం యుద్ధం చేసే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగానికి జేజేలు పలికారు. ఆయన చూపిన ఒక చిన్న సానుకూల వైఖరికే రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషించినట్లు అది తెలియజేస్తోంది. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించి ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు ఆయనను నెత్తిన పెట్టుకొనే ఉండేవారు. కానీ ఆయన తనకు దక్కిన ఆ అపూర్వకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. కేసీఆర్ చాలా హుందాగా వ్యవహరించి రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సరిగ్గా అదే ముక్క తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారు. కానీ వారిద్దరి హామీలకి వచ్చిన స్పందన పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రజలు తన నుండి ఏమి ఆశిస్తున్నారో ప్రధాని నరేంద్ర మోడీకి ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ ప్రత్యేక హోదా లేదా ప్యాకేజిపై నిర్దిష్టమయిన ప్రకటన చేయకపోవడంతో ఆయన విమర్శలు మూటగట్టుకొని తిరిగివెళ్ళారు. రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి సహకరించడం కేంద్రప్రభుత్వం బాధ్యతే కానీ తెలంగాణా ప్రభుత్వానిది కాదు. అయినప్పటికీ తమ ప్రభుత్వం దానికి సహకరిస్తుందని అని చెప్పి కేసీఆర్ రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని వెళ్ళారు. ప్రధాని ఒక మంచి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకొంటే, కేసీఆర్ దానిని ఎంచక్కగా ఉపయోగించుకొన్నారు. ఆయన రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోయినా రాష్ట్ర ప్రజలు ఏమనుకోరు కానీ ఇక ముందు కూడా ఇదే విధంగా స్నేహపూర్వకంగా ఉంటేచాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close