భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుందో లేదో?

పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడులు చేసినప్పటి నుండి భారత్-పాక్ దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు పెరగడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మూడు నెలలు అవుతున్నా ఇంతవరకు ఆ దాడికి పాల్పడిన వారినెవ్వరినీ అరెస్ట్ చేయకుండా యధాప్రకారం పాక్ తనకు అలవాటయిన అన్ని నాటకాలన్నీ ఆడుతోంది. ఆ కారణంగానే భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల మధ్య ఇస్లామాబాద్ లో జరుగవలసిన చర్చలు నిరవధికంగా మళ్ళీ వాయిదా పడ్డాయి. ఆ సంగతి పాక్ కి తెలిసినప్పటికీ చర్చలకు రావాలని భారత్ పై ఒత్తిడి చేస్తోంది.

పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిగినప్పుడు మోడీ ప్రభుత్వం కూడా చాలా హడావుడి చేసింది కానీ ఆ తరువాత ఎందుకో హటాత్తుగా నిశబ్ధమయిపోయింది. నిశబ్ధంగానే భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ కి అంగీకరించింది. అంటే పాక్ పట్ల భారత్ మళ్ళీ మెత్తబడిందని అర్ధమవుతోంది. భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి భారత్ ఇష్టపడనపుడు, ఇరు దేశాల ప్రజలలో చాలా తీవ్ర ఉద్రిక్తతలు కలిగించే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ని అనుమతించడం చాలా ఆశ్చర్యంగానే ఉంది. నిజానికి విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరిగినా జరుగకపోయినా ఇరుదేశాల ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే దానిని ఒక నిజమయిన యుద్ధంగానే భావిస్తుంటారు.

మరి ఆ సంగతి తెలిసి కూడా భారత్ గడ్డపై పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి మోడీ ప్రభుత్వం ఎందుకు అనుమతించిందో తెలియదు. పఠాన్ కోట్ పై దాడులు జరిగి మూడు నెలలు గడిచిపోయాయి కనుక బహుశః దేశ ప్రజలు దాని గురించి మరిచిపోయుంటారని అనుకొందో లేకపోతే పాక్ పట్ల దేశ ప్రజల స్పందన ఏవిధంగా ఉందో తెలుసుకొనేందుకే ఈ మ్యాచ్ కి అనుమతించిందో తెలియదు. ఒకవేళ దేశ ప్రజలు ఈ మ్యాచ్ ను ఆహ్వానించినట్లయితే, అప్పుడు భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశానికి ముహూర్తం పెట్టుకోవచ్చని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోందేమో?

మొదట హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మ్యాచ్ నిర్వహించాలనుకొన్నప్పటికీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ కి భద్రత కల్పించలేమని చేతులు ఎత్తేయడంతో దానిని కోల్ కోతాలోని ఈడెన్ గార్డెన్స్ కి మార్చేరు. కానీ అక్కడ కూడా మ్యాచ్ జరపడానికి వీలులేదని భారత తీవ్రవాద వ్యతిరేక ఫ్రంట్‌ (ఏటీఎఫ్‌ఐ) హెచ్చరిస్తోంది. పఠాన్ కోట్ పై జరిగిన దాడిని అప్పుడే మరిచిపోయి, ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, అండదండలు ఇస్తూ భారత్ పై దాడులకు ప్రోత్సహిస్తున్న పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటం సిగ్గుచేటని ఏటీఎఫ్‌ఐ వాదిస్తోంది. ఒకవేళ తమ హెచ్చరికలను కాదని ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ నిర్వహించాలనుకొంటే దానిని చాల తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఏటీఎఫ్‌ఐ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఈడెన్ గార్డెన్ పిచ్ ని తవ్వేస్తామని హెచ్చరిస్తున్నారు. భారత్ లో ఎదురవుతున్న ఈ వ్యతిరేకతను చూసి, తమ ఆటగాళ్ళ భద్రతకు పూర్తి భరోసా కల్పిస్తామని భారతప్రభుత్వం హామీ ఇస్తేనే మ్యాచ్ ఆడేందుకు తమ ఆటగాళ్ళను కోల్ కొతా పంపిస్తామని పాక్ క్రికెట్ బోర్డు చెపుతోంది. కనుక ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉందిపుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close