రాత్రికి రాత్రి వైట్ కోటింగ్..! 4 వారాలు ఎందుకు ఆగారు..?

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తొలగించాలని సుప్రీంకోర్టు జూన్ 3వ తేదీన తుది ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల గడువు ఈ నెలాఖరు మరో మూడు రోజుల్లో ముగుస్తుందనగా.. ఏపీ ప్రభుత్వం ఒక్క సారిగా నిద్ర లేచింది. అప్పటి వరకూ సుప్రీంకోర్టు తీర్పు కూడా పట్టనట్లుగా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం ఇష్టం లేదన్నట్లుగా యంత్రాంగం వ్యవహరించింది. కనీసం ఏం చేద్దామన్న చర్చ కూడా జరపలేదు. న్యాయవ్యవస్థ ఆదేశాలు కూడా ధిక్కరిస్తే.. అధికారులే ముందుగా బలైపోతారన్న అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో చొరవ చూపకపోయినా.. ఉన్నతాధికారులు హడావుడిగా జిల్లా స్థాయి అధికారులతో.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. తెలుగు రంగులు వేయాలని ఆదేశించారు.

రంగుల విషయంలో ఉన్నతాధికారులు మొదటి నుంచి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రంగులపై హైకోర్టు కోర్టు ధిక్కారం కింద ఉన్నతాధికారులకు నోటీస్ లు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నితోపాటు పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ కోర్టుకు స్వయంగా హాజరయ్యారు. గతంలో పంచాయతీ రాజ్ శాఖ నుంచి జారీ అయిన ఓ జీవో అధారంగానే రంగులు వేశారు. ఇప్పుడు దాన్ని హైకోర్టు కొట్టి వేసింది. కానీ దాని వల్ల వందల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయింది. దానికి బాధ్యులెవరన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనట్లుగా తెలుస్తోంది.

రంగులు మొత్తం తొలగించి.. తెలుపు రంగులు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత సీఎం జగన్ బొమ్మను మాత్రం ఉంచాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌ల్లో జగన్ బొమ్మను ఉంచారని జిల్లా అధికారులకు సూచించారు. కానీ అధికారికంగా విడుదల చేసిన జీవోల్లో మాత్రం అది లేదు. దాంతో.. జిల్లా స్థాయి అధికారులు టెన్షన్ పడుతున్నారు. జగన్ బొమ్మును తీసేయాలా.. ఉంచాలా.. అని మథన పడుతున్నారు. తీసేస్తే..ఓ బాధ.. తీయకపోతే మరో బాధ. తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వారు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close