బ‌న్నీ- బోయ‌పాటి.. ఏదో జ‌రుగుతోంది!

అల్లు అర్జున్ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌రైనోడు ఫుల్ మాస్ మిల్స్ లాంటి సూప‌ర్ హిట్టు అందుకొంది. ఈ సినిమాతో బ‌న్నీ మాస్‌కి మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యాడు. అప్ప‌టికి.. బ‌న్నీ కెరీర్ లో అదే బిగ్గెస్ట్ హిట్‌. ఆ త‌ర‌వాత బ‌న్నీతో మ‌రో సినిమా చేయాల‌ని బోయ‌పాటి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించాడు. కానీ కుద‌ర్లేదు. బ‌న్నీ కూడా బోయ‌పాటితో మ‌రోసారి ప‌నిచేయాల‌ని ఎప్పుడో ఫిక్స‌య్యాడు. త‌న‌కీ టైమ్ దొర‌క‌లేదు. అయితే ఇప్పుడు బ‌న్నీ – బోయ‌పాటి మ‌ధ్య కొత్త సినిమాకి సంబంధించిన డిస్క‌ర్ష‌న్స్ మొద‌ల‌య్యాయ‌ని టాక్‌. బ‌న్నీని నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంగా బోయ‌పాటి బ‌న్నీతో ములాఖ‌త్ అయ్యారు. వీరిద్ద‌రి మ‌ధ్య కొత్త సినిమాకి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని టాక్‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో వీరిద్ద‌రూ ఓ సినిమా చేసే అవ‌కాశాలు ఉన్నాయి. పుష్ప 2 ముగిసిన వెంట‌నే.. త్రివిక్ర‌మ్ తో ఓ సినిమా చేస్తాడు బ‌న్నీ. ఆ త‌ర‌వాత అట్లీ లాంటి వాళ్లు లైన్ లో ఉన్నారు. పుష్ప 2 కీ, త్రివిక్ర‌మ్ సినిమాకీ మ‌ధ్య‌లో ఏమాత్రం గ్యాప్ ఉన్నా, బోయ‌పాటి లైన్లోకి వ‌చ్చేస్తాడు. లేదంటే… ప్ర‌స్తుతానికి బ‌న్నీ చేతిలో ఉన్న క‌మిట్‌మెంట్స్ పూర్త‌య్యాకే… బోయ‌పాటి సినిమా ఉంటుంది. ఎలాగైతేనేం.. స‌రైనోడు 2 రాబోతోంది. ఇది మాత్రం ప‌క్కా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close