కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ !

ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కంటే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడం బెటరని నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను కలిశారు. చీరాల నియోజకవర్గంలో భారీ బహిరంగసభ పెట్టి బలప్రదర్శన చేసి పార్టీలో చేరనున్నారు.

నిజానికి చీరాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే.. ఆమంచి కృష్ణమోహనే. ఆయన తర్వాత ఇండిపెండెంట్ గా నవతరం అనే పార్టీ పేరుతో పోటీ చేస్తే.. క్యాడర్ అంతా ఆయన వెంట వచ్చింది. విజయం సాధించారు. తర్వాత టీడీపీ మీదుగా వైసీపీలో చేరారు. వైసీపీ బలానికి తన క్యాడర్ తోడయితే గెలవాల్సింది ఓడిపోయారు. వైసీపీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు.. ఆయనతో పాటు క్యాడర్ కూడా వస్తుందా లేదా అన్నది ఆయనకే తెలియాలి.

ప్రధాన పార్టీల్లో టిక్కెట్ దొరికే అవకాశం లేకపోవడంతో ఆమంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఆయనే సృష్టించుకున్నారు. రాజకీయాల్లో అవకాశాలను బట్టి పార్టీలు మారిపోవడం కామనే కానీ.. కాస్తంత రాజకీయ వ్యూహంతో అడుగులు వేయాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. చీరాల లాంటి సీటు నుంచి తప్పించి పర్చూరు ఇంచార్జ్ గా వేసినప్పుడే .. ఆమంచికి సీన్ అర్థమై ఉండాలి. కానీ చివరి వరకూ ఆలస్యం చేసి.. ఇప్పుడు మళ్లీ సొంత బలంతో సత్తా చూపాల్సిన సమయం వస్తోంది. ఇక్కడ తేడా కొడితే ఆయన రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close