క్రైమ్ వీడియో వైరల్ అయితేనే ఏపీలో కేసులు !

ఏపీలో వైరల్ వీడియోలపైనే కేసులు పెడుతున్నారు. ఆ వైరల్ వీడియోల్లో వైసీపీ నేతలుంటే అతి కష్ట మీద ఆలస్యం చేసి కేసులు పెడుతున్నారు. ఎప్పటికి అరెస్టు చేస్తారో.. అరెస్టు చేసినా వెంటనే విడుదల చేస్తారో వారికే తెలియదు. తాజాగా కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటనలో వైసీపీ కార్పొరేటర్ ఉన్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు ఆయన జోలికి వెళ్లలేదు. ఇతరుల పేర్లతో కేసు పెట్టేసి…. కొంత మందిని అరెస్టు చూపించారు. మరికొంత మంది దొరకలేదంటున్నారు.

కావలిలో ఆర్టీసీ ఉద్యోగిపై జరిగిన అరాచక దాడి దేశం మొత్తం వైరల్ అయింది. అత్యంత దారుణంగా .. తమ జోలికి ఎవరూ రారన్న ధైర్యంతో నిందితులు తెగబడిన వైనం చూస్తే… వారెవరికీ చట్టం అన్నా.. పోలీసులు అన్నా కనీస భయం లేదని స్పష్టమవుతోంది. దానికి తగ్గట్లుగానే పోలీసుల తీరు ఉంది. వీడియో వైరల్ అయ్యే వరకూ పట్టించుకోలేదు. తీవ్రమైన విమర్శలు రావడంతో ఓ రెడ్డి, మరో ఆరుగురు ముస్లింలపై కేసులు పెట్టారు. కార్పొరేటర్ పేరు మాత్రం నమోదు చేయలేదు. బాధితుడు… తనపై దాడి చేసిన వారిలో వైసీపీ కార్పొరేటర్ ఉన్నాడని చెబుతున్నారు.

ఇటీవల వైసీపీ నేతల దౌర్జన్యాల వీడియోలు విరివిగా వెలుగులోకి వస్తున్నాయి. వైరల్ అయితే తర్వాత తప్పనిసరిగా అన్నట్లుగా కేసులు పెడుతున్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి మానవహక్కులు ఉల్లంఘించిన ఘటనలో… స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. పైగా పుంగనూరు ఇమేజ్ చెడగొట్టాడానికి వీడియోలు వైరల్ చేస్తున్నారని ఎస్సీ రిషాంత్ రెడ్డి నిందితుల్ని వెనకేసుకు వచ్చారు. ఇలాంటి క్రైమ్స్ రాను రాను పెరుగుతున్నాయి. వీడియోలు ఎవరైనా తీసి.. వైరల్ అయితే నిందితులపై కేసులు పడుతున్నాయి. వీడియో లేని ఇంకెన్ని నేరాలు జరుగుతున్నాయో… అంచనా వేయడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close