ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవరు కానీ ఓడిస్తారు !

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక వ్యూహంతోనే రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంంది. షర్మిల ప్రత్యేకంగా ఓ బ్యాకప్ టీముని ఏర్పాటు చేసుకుని కీలకమైన నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న చోట ప్రభావం చూపే నాయకుల్ని ఆకర్షించి మరీ టిక్కెట్లు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికి నలుగురు ఎమ్మెల్యేలు, ఓ కేంద్ర మాజీ మంత్రి వైసీపీలో చేరి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలంతా దళితులే. అంతే కాదు నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఖరారు చేసిన వారిలో చాలా మంది తమ తమ సామాజికవర్గాల్లో అంతో ఇంతో పట్టున్నవారే. పైగా ఆర్థికంగానూ బలంగా ఉండే వారిని ఎంపిక చేసుకున్నారు.

నందికొట్కూరు నుంచి ఆర్థర్, చింతలపూడి నుంచి ఎలీజా, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరారు. వీరంతా వైసీపీకి వీర విధేయులు. అయినా ఆ పార్టీని వదిలేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టిక్కెట్ ఇవ్వకపోయినా చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న తర్వాత షర్మిల టీం చర్చలు జరిపి వీరిని పోటీకి అంగీకరింప చేసింది. ఇక కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి .. జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసి కాంగ్రెస్ లో చేరి.. టెక్కలి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.

ఇలా కనీసం 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల్ని నిలబెడుతోంది. అయితే వీరి బలం గెలవడానికి సరిపోదు. కానీ ఓడించడానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఏ స్థానంలోనూ నోటాను మించి ఓట్లు రాలేదు. కానీ ఈ సారి షర్మిల ప్రభావం గట్టిగా కనిపించనుంది. కీలకమైన స్థానాల్లో పది నుంచి పదిహేను వేల ఓట్లు చీలిస్తే పోటీలో ఉన్న కొంత మంది అభ్యర్థుల జాతకాలు తారుమారు అవుతాయి. అంత బలం చూపించేవారినే అభ్యర్థులుగా ఖరారు చేశారు.

1999 ఎన్నికల సమయంలో టీడీపీ ఓట్లను చీల్చడానికి లోక్ సత్తా పోటీ చేసింది. రెండు శాతం ఓట్లు చీల్చింది. లోక్ సత్తా పోటీ చేయకపోతే వారు ఎవరికి ఓటు వేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ గెలిచింది.. ఈ సారి కాంగ్రెస్ పార్టీ లోక్ సత్తా కన్నా ఎక్కువగా నాలుగైదు శాతం ఓట్లు చీల్చబోతోంది. ఎవరికి నష్టమో ఎన్నికల ఫలితాలు తేల్చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close