తూచ్! సాక్షి ప్రసారాలను ఆపమని చెప్పలేదు

రెండు వారాల క్రితం ముద్రగడ పద్మనాభం మళ్ళీ నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాక్షి మీడియా కాపులని రెచ్చగొట్టేవిధంగా ప్రసారాలు చేస్తునందున రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, అందుకే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో సాక్షి ప్రసారాలను ప్రభుత్వమే నిలిపివేయించిందని సాక్షాత్ రాష్ట్ర హోం మంత్రి చిన రాజప్ప మీడియాకి చెప్పారు. సాక్షిపై తాత్కాలికంగానే నిషేధం విధించామని, ముద్రగడ దీక్ష విరమించి పరిస్థితులు చక్కబడగానే సాక్షిపై నిషేధం ఎత్తివేస్తామని కూడా చెప్పారు.

సాక్షి ప్రసారాలని ప్రభుత్వం నిలిపివేయడాన్నిఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి హైకోర్టులో సవాలు చేశారు. దానిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది, సాక్షి ప్రసారాలని నిలిపివేయమని ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ గానీ ఎం.ఎస్.ఓ.లకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు. అదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో తమకి సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ ఈ కేసుని జూన్ 27కి వాయిదా వేశారు.

సాక్షి ప్రసారాలని నిలిపివేయాలనే అత్యుత్సాహంలో ఈ తరువాత పరిణామాల గురించి ప్రభుత్వం ఆలోచించడం మరిచిపోయినట్లుంది. అదే ఊపులో హోం మంత్రి చిన రాజప్ప తామే సాక్షి ప్రసారాలని నిలిపి వేయించమని ప్రకటించారు. ఆ రోజు ఆయన మీడియాకి చెప్పిన ఆ మాటల క్లిపింగ్స్ ని సాక్షి తరపు న్యాయవాది కోర్టుకి సమర్పించారు. కానీ ఇపుడు ప్రభుత్వం సాక్షి మీడియాని నిషేధించమని ప్రభుత్వం ఎవరినీ ఆదేశించలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడం పొరపాటేనని భావించవచ్చు. అదే విషయాన్నీ అఫిడవిట్ రూపంలో సమర్పించడం అంటే, ఆ మాటకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం అంగీకరించడమే అవుతుంది. అప్పుడు హోం మంత్రి చిన రాజప్ప వ్యాఖ్యల గురించి కోర్టు ప్రశ్నించడం ఖాయం. అదే జరిగితే కోర్టుకి సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం అవుతుంది. దాని వలన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు.

ఒకవేళ ప్రభుత్వం, పోలీసులు కోరకపోతే సాక్షి ప్రసారాలు ఎందుకు నిలిచిపోయాయి? ఎవరు నిలిపివేశారు? అని న్యాయస్థానం ప్రశ్నిస్తే దానికి సంతృప్తికరమైన సమాధానం చెప్పుకోవడం కష్టమే. ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఏమి ఉపాయం ఆలోచిస్తోందో? బహుశః ఆర్ధిక చెల్లింపుల వ్యవహారంలో సాక్షి తీరు సంతృప్తిగా లేనందునో, లేదా బకాయిలు చెల్లించనందుకో ప్రసారాలు నిలిపివేశామని ఎంఎస్.ఓ.ల ద్వారా చెప్పిస్తుందేమో? అయితే దానికి వారు సరైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఏవిధంగా చూసినా సాక్షి విషయంలో ప్రభుత్వానికి కోర్టులో మొట్టికాయలు తప్పవనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close