సోమవారం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ల విచారణ !

చంద్రబాబు దాఖలు చేసుకున్న ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతుందో లేదో స్పష్టత లేదు. కానీ లిస్టులో మాత్రం ఉంటోంది. సోమవారం ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది.. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడంతో న్యాయమూర్తుల రోస్టర్ మారుస్తూ చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్వాష్ పిటిషన్లను జస్టిస్ శ్రీనివాసరెడ్డి, బెయిల్ పిటిషన్లను సురేష్ రెడ్డి విచారించేవారు. ఇప్పుడు రోస్టర్ మారింది.

క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు రెండూ ఈ ఇద్దరు న్యాయమూర్తుల వద్దకు కాకుండా రోస్టర్‌లో వేరే కేసులను కేటాయంచారు. బెయిల్ పిటిషన్లను జస్టిస్ టి. మల్లిఖార్జునరావు బెంచ్ విచారణ జరపనుంది. అలాగే క్వాష్ పిటిషన్ల బెంచ్ కూడా మారింది. హైకోర్టుకు దసరా సెలవులకు ముందు పదే పదే బెయిల్ పిటిషన్లపై వాయిదాలు పడ్డాయి. తర్వాత విచారణ వాయిదా వేశారు. వెకేషన్ బెంచ్ లో విచారణ జరిగినా న్యాయమూర్తి నాట్ బిఫోర్ అన్నారు. దీంతో చంద్రబాబు కేసుల్లో అసలేం జరుగుతోందన్న చర్చ రాష్ట్రంలో ప్రారంభమయింది.

ఈ క్రమంలో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. ఆక్వాష్ పిటిషన్ కు బెయిల్ పిటిషన్ సంబంధం లేదు. అయినా హైకోర్టులో విచారణలు ముందుకు సాగడం లేదు. సోమవారం కూడా విచారణ జరుగుతుందా లేకపోతే వాయిదాలు పడతాయా అన్నది సస్పెన్స్ గానే ఉంది. ప్రభుత్వ లాయర్లు ఉద్దేశపూర్వకంగా వాయిదాలు అడుగుతూండటంతో ఈ సారి అదే చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close