సైకో పాలనకు సరైన గుణపాఠం చెప్పాలి: బాలకృష్ణ

”వైసీపీ అక్రమాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు. సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర్గ స్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి మనది. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉంది” అని పేర్కొన్నారు ఎమ్మెల్యే, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ . టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా భారీగా జరుగుతోంది.

ఈ సభలో బాలకృష్ణ మాట్లాడారు. వైసీపీ సైకో పాలనలో రాష్ట్రం అన్నీ రంగాల్లో వెనుకబడింది. అయితే డ్రగ్స్‌ దందాలో మాత్రం రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిపిపింది వైసీపీ. ల్యాండ్‌, శాండ్‌ స్కాములతో రూ.కోట్లు దోచుకున్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు లేవు. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. వైకాపా అక్రమాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు. ఇప్పుడింక సమయం లేదు. విజయమా.. వీర్గ స్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి మనది. వైసీపీ సైకో పాలనకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలి’ అని పిలుపునిచ్చారు బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూల నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close