సాక్ష్యం నైజాం అమ్మకం వెనుక?

సాక్ష్యం సినిమా నైజాం హక్కులు ఏడు కోట్లకు అమ్ముడుపోయాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. నలభై కోట్లతో తీసిన సినిమా, ఆ రేంజ్ లో అమ్మకుంటే ఎలా అనుకున్నారంతా. నైజాంలో ఏడు కోట్ల రేంజ్ లో అమ్మితే, ఆంధ్ర ఓ పది కోట్లు, సీడెడ్ ఓ అయిదారు కోట్లు కలిసి టోటల్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్ హక్కులు పాతిక నుంచి ముఫై కోట్ల మధ్యలో రావాల్సి వుంటుందని అంచనాలు కట్టారు.

అయితే నైజాం అమ్మేసినట్లు, దిల్ రాజు కొన్నట్లు వార్తలు వచ్చినా, ఇంకా మరే ఏరియా అమ్మకాలు మొదలు కాలేదు. ట్రయిలర్ విడుదల వరకు అందరూ వేచి చూస్తున్నారు. ఇకపై అమ్మకాలు షురూ కావాలి.

అయితే ఇదిలా వుంటే నైజాం అమ్మకం వెనుక మతలబు వేరు అని టాక్ వినిపిస్తోంది. నైజాం హక్కులను ఏడు కోట్లకు వాల్యూ కట్టి, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నే తీసుకున్నారని తెలుస్తోంది. అలా తీసుకుని, ఆయన దిల్ రాజు దగ్గర డిస్ట్రిబ్యూషన్ కు వుంచారట. ఇలా కట్టిన ఏడు కోట్లలో అయిదు కోట్లు హీరో రెమ్యూనిరేషన్ కింద, మిగిలిన రెండు కోట్లు అదనం అన్నమాట.

అంటే హీరో పారితోషికం లేకుండా సినిమా చేసాను అని అనుకుంటే, నైజాం హక్కులు రెండు కోట్లకు వచ్చినట్లు. ఆపై ఎంత వస్తే, అంతా పారితోషికం అన్నమాట. ఇలా నైజాం ఇంత రేటు పలికింది అన్నది చూపించిన మిగిలిన ఏరియాలు విక్రయించాలన్నది ఆలోచనగా తెలుస్తోంది.

మొత్తం మీద బెల్లంకొండ సురేష్ ఘటికుడే. కొడుకుతో మంచి సినిమాలు ఎలా తీయించాలో, ఎలా మార్కెట్ చేయించాలో బాగా తెలుసు. అందుకే మరో రెండు సినిమాలు అప్పుడే లైన్లో పెట్టాడు, సాక్ష్యం విడుదల కాకుండానే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close