చిరంజీవిని బీజేపీలోకి లాగడానికి ప్రయత్నాలు ముమ్మరం

మెగాస్టార్ చిరంజీవి ని బీజేపీ లోకి లాగడానికి ఆ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2024 లోపు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రావడానికి వ్యూహాలు రచిస్తున్న బీజేపీ, అందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు అన్న సంకేతాలు ఇస్తోంది. వివరాల్లోకి వెళితే..

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, కేంద్ర సహాయ మంత్రి పదవితో సరిపెట్టుకున్న చిరంజీవి రాజకీయాల్లో తాను ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు అని చెప్పాలి. ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి కి, తన పార్టీని విలీనం చేసుకున్న కాంగ్రెస్ కనీసం కేబినెట్ స్థాయి కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం చిరంజీవి అభిమానుల లో కూడా అసంతృప్తిని మిగిల్చింది. 2018 ఏప్రిల్ లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియడంతో అప్పటినుండి రాజకీయ కార్యకలాపాలకు చిరంజీవి దూరంగా ఉన్నారు. తన సినిమా షూటింగులతో బిజీ అయిపోయి ఏ రాజకీయ పార్టీలో తాను లేను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రచారం చేయలేదు.

అయితే చేరికల విషయంలో వేగం పెంచిన బీజేపీ తెలుగుదేశం పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల లో ఎంతమంది తెలుగుదేశం పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలలో చాలామంది ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. చిరంజీవి కనుక తమ పార్టీలో చేరితే పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే చిరంజీవి బీజేపీ ఆఫర్ ని ఎంత వరకు ఒప్పుకుంటారు అనేది ప్రస్తుతానికి సందేహాస్పదంగా కనిపిస్తుంది . ఏది ఏమైనా ఈ విషయంలో తదుపరి అప్డేట్స్ కోసం వేచి చూడాల్సి ఉంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close