జూన్‌లో బీఆర్ఎస్‌కు అసలు సవాల్ !

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. కనీసం ఖాతా ఓపెన్ చేయాలన్న లక్ష్యం పెట్టుకుంది. అలా అయితే ఉనికి నిలబడుతుంది. ఆ ఫలితాలు ఎలా ఉన్నా.. వెంటనే మరో సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ కావాల్సిందే. అవే స్థానిక ఎన్నికలు. లోక్ సభ ఎన్నికలు అయిపోగానే.. స్థానిక ఎన్నికలు పూర్తి చేసి.. పాలనపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు అంటే..అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా ఉంటాయని చెప్పాల్సిన పని లేదు. ఎలా గెలవాలో గతంలో కేసీఆర్ చూపించారు. రేవంత్ అంతకు రెండింతలు చేస్తారు. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ సానుభూతిపరుల్ని కూడా కాపాడుకోవడం బీఆర్ఎస్ కు పెను సవాల్ గా మారనుంది. మాములుగా అయితే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ కాబట్టి … ఆ పార్టీలో ఉండలేని వాళ్లు బీఆర్ఎస్ లో ఉంటారనుకుంటారు.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉంది. కాంగ్రెస్ తో పడని వాళ్లు బీజేపీ నుంచి పోటీ చేస్తారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి.. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపాలై.. స్థానిక ఎన్నికల్లోనూ ఉనికి కోల్పోతే.. బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. బీఆర్ఎస్ ను ఎంత బలహీనం చేస్తే.. అంతగా పాలనపై దృష్టి పెట్టగలనని రేవంత్ అనుకుంటున్నారు. అందుకే జూన్ లో .. మరో సవాల్ కు బీఆర్ఎస్ రెడీ కావాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close