లెక్క‌లు దాటేసిన ‘శాకుంత‌లం’

గుణ‌శేఖ‌ర్ ద‌గ్గ‌ర ఓ అల‌వాటు ఉంది. ఎంత చిన్న క‌థైనా.. భారీ స్థాయిలో చెబుతాడు. సెట్లూ, హంగుల‌కు భారీగా ఖ‌ర్చు పెడ‌తాడు. అందుకే తాను అనుకొన్న బ‌డ్జెట్ లో సినిమా ఎప్పుడూ పూర్తి చేయ‌లేడు. ‘శాకుంత‌లం’ విష‌యంలో ఇదే జ‌రిగింది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందించిన సినిమా ఇది. రూ.50 కోట్ల‌లో ఈ సినిమా పూర్తి చేయాల‌నుకొన్నాడు.కానీ ఇప్పుడు మొత్తం బ‌డ్జెట్ రూ.65 కోట్లు దాటేసింది. ఇంకా ప్రీ ప్రొడ‌క్ష‌న్, ప్ర‌మోష‌న్స్ ఉన్నాయి. స‌మంత ఇప్పుడు అనారోగ్యం పాలైంది. ఆమె కోలుకొని రావ‌డానికి టైమ్ ప‌డుతుంది. `శాకుంత‌లం` కూడా ఇప్ప‌ట్లో రిలీజ్ అవ్వ‌దు. దాంతో.. ఈ సినిమాపై వ‌డ్డీల భారం ప‌డ‌బోతోంది.

అయినా గుణ‌శేఖ‌ర్ ధీమాగానే ఉన్నాడు.ఎందుకంటే ‘శాకుంత‌లం’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేద్దామ‌నుకొంటున్నాడు. ఇదో విజువ‌ల్ ఫీస్ట్ కాబ‌ట్టి… భాష‌కు అతీతంగా ఈసినిమా చూస్తార‌న్న‌ది గుణ‌శేఖ‌ర్ న‌మ్మ‌కం. త్వ‌ర‌లో `య‌శోద‌` రిలీజ్ కాబోతోంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ‘య‌శోద‌’ హిట్ట‌యి, మంచి లాభాలొస్తే… `శాకుంత‌లం`కు అది ప్ల‌స్ అవుతుంది. అందుకే `య‌శోద‌` రిజ‌ల్ట్ ఏమ‌వుతుందా? అని గుణ‌శేఖ‌ర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. న‌వంబ‌రు 11న `య‌శోద‌` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close