రోజా సమీక్షకు బైరెడ్డి సిద్ధార్థ్ డుమ్మా – అసంతృప్తి నిజమేనా ?

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారని ప్రో వైసీపీ మీడియా అయిన ఎన్టీవీ, టీవీ9లోనే విస్తృతంగా ప్రచారం చేసారు. అయితే ఆయన ఈ వార్తలను ఖండించారు. తాను జగన్ సైనికుడినని ప్రకటించుకున్నారు. అయినా రూమర్స్ మాత్రం సద్దుమణగడం లేదు. దానికి ఆయనే కారణం అవుతున్నారు. శాప్ చైర్మన్‌గా నామినేటెడ్ పోస్టు పొందిన బైరెడ్డి కొద్ది రోజులు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అసలు వైసీపీ కార్యక్రమాల్లోనే పాల్గొనడంలేదు.

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో యువజన వ్యవహారాల శాఖను రోజాకు కేటాయించారు. శాప్ కూడా ఆమె మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుంది. శాప్ వ్యవహారాలపై తిరుపతిలో సమీక్ష ను రోజా నిర్వహించారు. ఈ సమీక్షలో అంతా తానై వ్యవహరించాల్సిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కాలేదు. సిద్దార్థ రెడ్డి ఎందుకు రాలేదన్న అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే జరుగుతున్న పరిణామాలపై అవగాహన ఉందేమో కానీ రోజా ఈ విషయాన్ని పట్టించుకోకుండానే సమీక్ష ముగించి వెళ్లారు.

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడబోనని.. మీడియాను పిలిచి మరీ చెబుతున్న ఆయన అదే సమయంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరం పాటిస్తున్నారు. దీనికి కారణం తన అసంతృప్తిని పార్టీకి తెలియచేయాలనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంది కొట్కూరు బాధ్యతలను సిద్ధార్థ్ రెడ్డి చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకా ఆర్థర్ ఉన్నారు. ఆయనకు సిద్ధార్ధరెడ్డికి సరిపడటం లేదు. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ .. సిద్ధార్థరెడ్డికి హెచ్చరికలు జారీ చేసిందని నియోజకవర్గంలో వేలు పెట్టవద్దని చెప్పిందని తెలుస్తోంది. దీంతో సిద్ధార్థరెడ్డి అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close