పబ్‌జీ పై కేంద్రం వేటు..!

భారత్‌లో పబ్‌జీ వీడియో గేమ్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఓ వైపు చైనా సరిహద్దుల్లో అలజడి రేపుతూండటంతో మరో వైపు సరిహద్దులతో పాటు… చైనీస్ కంపెనీలపైనా..సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకంది. అందుకే.. పబ్‌జీతో పాటు మరో 118 చైనీస్ మొబైల్ అప్లికేషన్స్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌ను కేంద్రం బ్యాన్ చేసింది. ఈ సారి ఆ జాబితాలోకి పబ్‌జీ చేరింది.

ప్రస్తుతం కేంద్రం విధించిన నిషేధం జాబితాలో అలీ ఎక్స్‌ప్రెస్, లూడో లాంటి యాప్స్ కూడా ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భారత వినియోగదారుల డేటా తస్కరిస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది. చైనాలో సర్వర్లు ఉన్న కంపెనీల నుంచి ప్రభుత్వం ఏ సమాచారాన్ని అయినా తీసుకునేలా చైనా 2017లో చట్టం చేసింది.దీంతో ఈ నేపథ్యంలో భారత్, సహా వివిధ దేశ వినియోగదారుల డేటాపై డ్రాగన్ నియంత్రణలో ఉంటోంది. అక్కడి నుంచి సమాచారం తస్కరిస్తున్నారని కేంద్రం గుర్తించింది.

ఈ సారి నిషేధించిన యాప్‌ల జాబితాలో వీపీఎన్‌లు కూడా ఉన్నాయి. టిక్ టాక్ వీపీఎన్‌ను బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో చైనాకు చెందిన లక్షలాది యాప్‌లు ఉన్నాయి. వాటిలో భారత్‌లో ఎక్కువ వినియోగంలో ఉన్నవి చూసి.. భారత ప్రభుత్వం నిషేధఘిస్తోంది. చైనాను దారిలోకి తీసుకురావాలంటే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భారత్ భావిస్తోంది. ఇండియాలానే ఇతర దేశాలు కూడా..చైనీస్ యాప్స్‌ను నిషేధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close