జ‌న‌సేన‌, వైకాపా పోటీ చేయ‌క‌పోవ‌డం లాలూచీ కాదా?

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసమే తాము కేంద్రంలోని భాజ‌పాతో పోరాటం సాగిస్తున్నామ‌నీ, అనుకున్న‌ది సాధించే వ‌ర‌కూ పోరాటం కొన‌సాగిస్తామ‌న్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. నెల్లూరులోని ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ… భాజ‌పాతోపాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మీద కూడా విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీని దెబ్బ‌తియ్యాల‌ని భాజ‌పా చూస్తోంద‌నీ, అది ఎవ‌రి వ‌ల్లా కాద‌న్నారు. వైకాపా, జ‌న‌సేన‌లు లాలూచీ రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతూ ఉంటే ఎందుకు ప‌వ‌న్ పోటీ చెయ్య‌లేద‌నీ, ఎందుకు జ‌గ‌న్ పోటీకి దిగ‌లేద‌నీ… ఇదంతా లాలూచీ రాజ‌కీయం కాదా అని ప్ర‌శ్నించారు.

ఈరోజున రాజ్యాంగ ప‌ర‌మైన ఒక‌ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మైంది కాబ‌ట్టి, కాంగ్రెస్ తో తాము క‌లిశామ‌న్నారు చంద్ర‌బాబు నాయుడు. దేశంలో మ‌నం ఒక్క‌రమే ఎదురెళ్లి ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని ఎదుర్కోలేమ‌నీ, మన శ‌క్తికి తోడుగా దేశంలోని ఇత‌ర రాజ‌కీయ పార్టీలూ వెంట రావాల‌నీ, ఆ క్ర‌మంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ కూడా రావాల‌న్నారు. న‌ల‌భై సంవ‌త్స‌రాల భేదాభిప్రాయాల‌ను ప‌క్క‌న‌పెట్టి, తానే ఒక్క అడుగు ముందుకేసి దేశం కోసం, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం, మ‌న రాష్ట్ర హ‌క్కుల కోసం ముందుకొచ్చాను అన్నారు. జాతీయ స్థాయిలోని కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌న్నీ భాజ‌పా భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు.

రాష్ట్రం కోసం ఏం చేశారంటూ త‌మ‌ను వైకాపా నేత‌లు ప్ర‌శ్నించ‌డం హాస్యాస్పదం అన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్న‌ప్పుడు.. ధైర్య‌ముంటే త‌మ‌తో రావాల‌ని స‌వాలు విసిరామ‌నీ, కానీ ఆ త‌రువాత ఏం జ‌రిగిందో ప్ర‌జ‌లు చూశార‌న్నారు. వైకాపా ఎంపీలు రాజీనామాలు చేస్తే… సంవ‌త్స‌రం కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్న‌ట్టుగా చూసుకుని భాజ‌పా ఆమోదించింద‌న్నారు. వీళ్ల‌కి ఎన్నిక‌లంటే భ‌య‌మ‌నీ, మోడీ అంటే వీళ్ల‌కి భ‌య‌మనీ, ఎందుకంటే ఈ నాయ‌కుల మీద కేసులున్నాయ‌న్నారు. ఎదురిస్తే జైలుకి పోతామ‌న్న భ‌యంతో రాష్ట్ర హ‌క్కుల‌ను తాక‌ట్టుపెట్టిన పార్టీ వైకాపా అని విమ‌ర్శించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా నిజ నిర్ధార‌ణ క‌మిటీ అంటూ హ‌డావుడి చేశార‌నీ, ఆ త‌రువాత ఏమ‌య్యార‌ని ప్ర‌శ్నించారు? అవిశ్వాసం పెడితే మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌ని సినిమా డైలాగ్ చెప్పి, అడ్ర‌స్ లేకుండా పోయార‌ని ముఖ్య‌మంత్రి విమ‌ర్శించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close