హ‌రీష్‌కు లైన్ క్లియ‌ర్ చేసిన చిరు

చిరంజీవి ప్ర‌స్తుతం ‘విశ్వంభ‌ర‌’తో బిజీగా ఉన్నారు. ‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత ఎవ‌రితో సినిమా చేస్తార‌న్న విష‌యంలో సిందిగ్థం నెల‌కొంది. చిరు చుట్టూ దాదాపు 10 మంది ద‌ర్శ‌కులు ఉన్నారు. వాళ్లంతా చిరుకి క‌థ‌లు చెప్పి ‘ఓకే’ చేయించుకొన్న‌వాళ్లే. అయితే చిరు వాళ్లలో ఎవ‌రికి అభ‌య‌హ‌స్తం ఇచ్చార‌న్న విష‌యంలో క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం చిరు నెక్ట్స్ సినిమాపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. చిరు త‌దుప‌రి సినిమా హ‌రీష్ శంక‌ర్‌తో ఫైన‌ల్ అవ్వ‌డం దాదాపు ఖాయం అయిపోయింది. బీవీఎస్ ర‌వి ఈ చిత్రానికి క‌థ అందిస్తున్నారు. స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోమ‌ని హ‌రీష్‌కు చెప్పేశార్ట చిరు. అందుకే హ‌రీష్ చిరు ప్రాజెక్ట్‌పై మ‌రింత‌గా ఫోక‌స్ చేశారు.

హ‌రీష్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప‌వ‌న్ తో ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌’ రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప‌క్క‌న పెట్టి, ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీ అవ్వ‌డం వ‌ల్ల ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు హ‌రీష్. ఆ సినిమా శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. `విశ్వంభర`లో చిరు వ‌ర్క్ ఈ జూలై నాటికి అవుతుంది. ఆ త‌ర‌వాత చిరు ఫ్రీనే. ఆగ‌స్టు నుంచి హ‌రీష్ – చిరంజీవి సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంది. ఓవైపు ప‌వ‌న్‌, మ‌రోవైపు చిరంజీవి సినిమాలు రెండింటీని హ‌రీష్ ఒకేసారి పూర్తి చేసే అవ‌కాశం ఉంది. చిరు, ప‌వ‌న్‌ల‌ను ఒకే స‌మ‌యంలో డైరెక్ట్ చేసే అరుదైన ఛాన్స్‌.. హ‌రీష్ చేజిక్కించుకొన్న‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close