గెలిచేలా లేరు… తెలంగాణ‌లో అభ్య‌ర్థుల‌ను మార్చ‌బోతున్న కాంగ్రెస్?

తెలంగాణ‌లో ప‌దికి పైగా ఎంపీ సీట్ల ల‌క్ష్యంతో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుందా? రాష్ట్ర నేత‌ల ప్ర‌మేయం లేకుండా గెలిచేలా లేని అభ్య‌ర్థుల‌ను మార్చ‌బోతున్నారా…? ఏఐసీసీ కీల‌క నేత కేసీ వేణుగోపాల్ ఎమ‌ర్జెన్సీ మీటింగ్ అందుకేనా?

గాంధీభ‌వ‌న్ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి. ఇండియా కూట‌మిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి భారీ ఆశ‌లున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక‌టి. స్వ‌త‌హాగా ప‌దికి పైగా స్థానాలు గెలిచే అవ‌కాశం ఉన్న తెలంగాణ‌లో ప‌ట్టువిడ‌వ‌ద్దు అన్న ల‌క్ష్యంతో ఏఐసీసీ నుండి కేసీ వేణుగోపాల్ ఆదివారం సాయంత్రం పోటీ చేసే అభ్య‌ర్థుల‌తో ప్ర‌త్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా ఈ మీటింగ్ కు హ‌జ‌రుకాబోతున్నారు.

రాష్ట్ర నేత‌ల ప్ర‌మేయం లేకుండా ఏఐసీసీ స్వ‌యంగా ఓ ఫ్లాష్ స‌ర్వే చేసింద‌ని… ఇటు సునీల్ క‌నుగోలు టీంతో మ‌రో స‌ర్వే చేయించుకున్న ఏఐసీసీ, ఆ రెండు స‌ర్వేల ఆధారంగా గెలుపు గుర్రాల‌నే బ‌రిలో ఉంచాల‌ని, గెలిచే అవ‌కాశం స‌న్నగిల్లుతున్న అభ్య‌ర్థుల‌ను మార్చాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

అంతేకాదు టికెట్ ప్ర‌క‌టించి వెన‌క్కి తీసుకుంటే వ‌చ్చే అసంతృప్తుల‌ను చ‌ల్లార్చే బాధ్య‌త‌ను ముందుగానే డిప్యూటీ సీఎం భ‌ట్టికి అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ భ‌ట్టి, ఉత్త‌మ్ లే అసంతృప్తుల‌ను స‌క్సెస్ ఫుల్ గా డీల్ చేయ‌టంతో ఇప్పుడు కూడా వారికే బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. వీరితో పాటు పెండింగ్ లో ఉన్న ఖ‌మ్మం, హైద‌రాబాద్, కరీంన‌గ‌ర్ సీట్ల‌లో అభ్య‌ర్థుల విష‌యం కూడా ఈ మీటింగ్ లో ఓ కొలిక్కి వచ్చే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close