‘య‌శోద’ రిజ‌ల్ట్… గుఖ‌శేఖ‌ర్ వెయిటింగ్‌

మ‌రి కొద్ది గంట‌ల్లో ‘య‌శోద‌’ భ‌విత‌వ్యం తేలిపోతుంది. స‌మంత చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. అనారోగ్యంతో.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన‌లేక‌పోయింది స‌మంత‌. ఓ వీడియో ఇంట‌ర్వ్యూ చేసి వ‌దిలినా.. పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ఇదంతా.. రేపు ఓపెనింగ్స్ పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందా? అని మ‌రోవైపు గుణ శేఖ‌ర్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘శాకుంత‌ల‌మ్లో’నూ త‌నే హీరోయిన్‌. కేవ‌లం స‌మంత ఇమేజ్‌ని నమ్ముకొని తీసిన సినిమాలు ‘య‌శోద‌’, ‘శాకుంత‌ల‌మ్’. ఈ సినిమాలో ఉన్న ఏకైక స్టార్ స‌మంత మాత్ర‌మే. స‌మంత‌ని చూసి జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారా, రారా అనేది ‘య‌శోద‌’తో తేలిపోతుంది.

‘య‌శోద‌’తో పోలిస్తే.. ‘శాకుంత‌ల‌మ్‌’కి భారీ బడ్జెట్ అయ్యింది. గుణ‌శేఖ‌ర్ స్వ‌త‌హాగానే… మేకింగ్ పై దృష్టి పెడుతుంటాడు. శాకుంత‌ల‌మ్ లో విజువల్స్‌కి ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాకి దాదాపుగా రూ.70 కోట్ల‌యిన‌ట్టు టాక్‌. ‘య‌శోద‌’ కూడా అటూ ఇటూగా రూ.30 కోట్ల సినిమానే. స‌మంత న‌టించిన ‘యూ ట‌ర్న్‌’కి మంచి రిపోర్ట్ వ‌చ్చినా – బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏమాత్రం ప్ర‌భావితం చేయ‌లేక‌పోయింది. ‘ఓ బేబీ’ బొటాబొటీ క‌లక్ష‌న్ల‌తో గ‌ట్టెక్కింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘య‌శోద‌’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుంద‌న్నది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ‘య‌శోద‌’ క‌ల‌క్ష‌న్లు ఏమాత్రం బాగున్నా.. ప‌రోక్షంగా శాకుంత‌ల‌మ్ సినిమాకి హెల్ప్ అవుతుంది. అందుకే.. గుణ‌శేఖ‌ర్ దృష్టంతా.. య‌శోద‌పై ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close