హ‌రీష్ శంక‌ర్ సినిమాలో హీరో మారాడా?

ఈమ‌ధ్య టాప్ ద‌ర్శ‌కులు… త‌మ శిష్యుల సినిమాల‌కు క‌థ‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ లో తెర‌కెక్కే చిన్న సినిమాల‌న్నింటికీ సుకుమారే క‌థ‌కుడు. అలానే హ‌రీష్ శంక‌ర్ సైతం ఓ క‌థ‌ని త‌న శిష్యుడికి ఇచ్చాడు. ఆక‌థే `వేదాంతం రాఘ‌వ‌య్య‌`. సునీల్ క‌థానాయ‌కుడిగా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల్సింది. చాలా రోజుల క్రిత‌మే ఈ ప్రాజెక్టుని ప్ర‌క‌టించారు అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఈలోగా ఈ సినిమా స‌మీక‌ర‌ణాలు చాలా మారాయ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. అనిల్ సుంక‌ర ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నార‌ని, ఈ సినిమా నిర్మాత‌లు మార‌బోతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు సునీల్ ప్లేసులో మ‌రో హీరో వ‌స్తున్నాడ‌ట‌. సునీల్ కి రీప్లేస్‌మెంట్ గా స‌త్య‌దేవ్ పేరు ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. అయితే ఈ సినిమా నుంచి సునీల్ ఎందుకు త‌ప్పుకోవాల‌ని అనుకుంటున్నాడో తెలీలేదు. హ‌రీష్ ఈ స్క్రిప్టుని ఎప్పుడో పూర్తి చేశాడు. త‌ను ప్ర‌స్తుతం త‌న దృష్టినంతా.. ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాపైనే పెట్టాడు. ప‌వ‌న్ – హ‌రీష్ కాంబినేష‌న్‌లో `భ‌త‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌` అనే చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. హ‌రీష్ ఈ సినిమాపై క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. మ‌రి… వేదాంతం రాఘ‌వ‌య్య ఎప్పుడు మొద‌ల‌వుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close