ఏపీలో అంతే: స‌మోసా కంటే టికెట్ రేటు చ‌వ‌క‌

బాల్క‌నీ రూ.20
ఫ‌స్ట్ క్లాస్ రూ.15
సెకండ్ క్లాస్ రూ.10

ఇవేం… ప‌దేళ్ల క్రితం రేట్లు కావు. ఇప్ప‌టి ధ‌ర‌లే. సినిమా చూడాలంటే జేబులో రూ.10 ఉంటే స‌రిపోతుంది. ఇలాంటి మ్యాజిక్ ఏపీలోనే సాధ్యం.

ఏపీలో, అర్జెంటుగా జీవోలు పాస్ చేయించి, టికెట్ రేట్లు త‌గ్గించిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్ల‌పై నిర్ణ‌యాధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌ని హై కోర్టు చెప్పినా, మార్పు రాలేదు. త‌గ్గించిన టికెట్ రేట్లే చ‌లామ‌నీ అవుతున్నాయి. తెలంగాణ‌లో బాల్క‌నీ రేటు రూ.100 నుంచి రూ.150 ఉంటే, ఏపీలో అది కేవ‌లం రూ.20 మాత్ర‌మే. అదీ.. తాజా ప‌రిస్థితి.

రూ.20 పెడితే స‌మోసా రాదు. థియేట‌ర్ల‌లో కూల్ డ్రింక్ తాగాల‌న్నా క‌నీసం రూ.30 ఖ‌ర్చు పెట్టాలి. అలాంటిది.. సినిమా టికెట్ మాత్రం ప‌ది కే దొరికేస్తోంది.

దానికి తోడు ప్ర‌భుత్వాధికారులు థియేట‌ర్ల‌పై సోదాల‌కు దిగారు. టికెట్ రేట్ల విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూ, నిబంధ‌న‌లు పాటించ‌ని దాదాపు 20 థియేట‌ర్ల‌కు సీజ్ చేశారు. ఈ సంఖ్య గంట గంట‌కీ పెరిగే అవ‌కాశం ఉంది. ఇదంతా ప్ర‌భుత్వ క‌క్ష సాధింపు చ‌ర్యే అన్న‌ది థియేట‌ర్ య‌జ‌మానులు, బ‌య్య‌ర్ల మాట‌. అందుకే రేపు విజ‌య‌వాడ‌లో డిస్ట్రిబ్యూట‌ర్ల అత్య‌వ‌స‌ర స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. థియేట‌ర్లు న‌డ‌పాలా? వ‌ద్దా? అనే విష‌యంలో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టి రేట్ల‌కు థియేట‌ర్లు న‌డిపే ప‌రిస్థితి లేదు. బాల్క‌నీ రూ20 కి అమ్మితే క‌నీసం థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు కూడా రావు. దానికి తోడు ఈ ఆక‌స్మిక త‌నిఖీలు, సీజుల గోల ఒక‌టి. అందుకే.. థియేట‌ర్ య‌జ‌మానులంతా ఏకం అవ్వాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. చూడాలి.. రేపు ఏం జ‌రుగుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close