డమ్మీ పోలీస్ : అసలు రాయి కూడా దొరకలేదా !?

ఏపీలో పోలీసు వ్యవస్థ ఎలా అయిపోయిందంటే.. సీఎంపై రాయి పడిందంటే.. . ఆ రాయిని కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన లేనంత మైండ్ మొద్దుబారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అరచేతిలో ఇమిడిపోయేంత రాయితే కింద నుంచి ఎవరో విసిరితే.. జగన్ రెడ్డి తలకు తగిలి బౌన్స్ అయి.. వెల్లంపల్లి కంటికి తగిలి కింద పడింది. అది ఎక్కడో పడదు… తగిలిన వారి దగ్గరే పడుతుంది. బస్సు మీదనే పడుతుంది. కానీ ఆ రాయిని ఎవరూ గుర్తించలేదు. ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. కేసులో మొదటి సాక్ష్యం అదే అవుతుంది.

పద్నాలుగు వందల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ చెప్పారు. అంత మంది ఉంటే.. కనీసం దాడి చేసిన రాయిని కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదు.. ఇప్పుడు ప్రెస్ మీట్లలో అరచేయి అంత రాయి అని ఊహాగానాలతో చెప్పడం ఎందుకు ?. దాడి జరిగినప్పుడు … పద్నాలుగు వందల మంది పోలీసులు ఉంటే… ఆ సరౌండింగ్స్ మొత్తాన్ని బ్లాక్ చేసి ఉంటే.. నిందితుడు అక్కడే ఉండేవాడు కదా.. పట్టుకోవడం ఎంత సేపు ?

ఎలా చూసినా పోలీసులు రక్షణ పరంగానే కాదు.. దాడి తర్వాత వ్యవహరించిన విధానంపైనా అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు రాయి దాడి జరగకుండా డ్రామా అయినా ఆడి ఉండాలి.. లేకపోతే పోలీసుల సాయంతోనే ఈ డ్రామాను రక్తి కట్టించి ఉండాలి… అందుకే పవన్ కల్యాణ్ ఇలాంటి పోలీసులతో ఎలా దర్యాప్తు చేయిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.ప్రజల డౌట్ కూడా అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close