శాంతిభద్రతలపై ఈసీకి రిపోర్ట్ – చర్యలపై ఉత్కంఠ

ఏపీలో వీఐపీల పర్యటనల్లో ఏర్పడుతున్న శాంతిభద్రతల ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. రాష్ట్ర సీఈవో నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఘటనలపై సీఈవో పోలీసుల వద్ద నుంచి నివేదిక తీసుకున్నారు. వాటిని క్రోడీకరించి ఈసీకీ పంపించారు. ఏపీలో పోలీసుల భద్రతా వైఫల్యం ఉందని సరైన నాయకత్వం లేదని అధికార పార్టీ కోసం పని చేస్తున్నట్లుగా ఉందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.

కఠినంగా వ్యవహరించకపోవడం తరచూ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పర్చి పోలింగ్ ప్రక్రియను ప్రభావితం చేయడానికన్న అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో కొంత మంది పోలీసు అధికారులు సమూహంగా ఏర్పడి అధికార పార్టీ కోసం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలించి ఈసీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఏపీ డీజీపీ శాశ్వత డీజీపీ కాదు. ఆయన ఇంచార్జ్ డీజీపీ. పది మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆయనను జగన్ డీజీపీని చేశారు. ఆయన సమర్థంగా విధులు నిర్వహించలేకపోతున్నారని స్పష్టమయింది. ఇక సీఎస్ కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా అప్పులకు ప్రయత్నించడం.. ఆస్తులు రాసివ్వడం వంటివ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేప్రయత్నం కూడా చేయడం వివాదాస్పదమయింది. ఒకటి రెండు రోజుల్లో ఏపీలో పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఈసీ భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close