కేసీఆర్ వర్సెస్ గవర్నర్ – రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారా?

రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించకపోవడం, హైకోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడం తోడు… గవర్నర్ పై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూండటంతో తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్అన్న పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. పుదుచ్చేరి కూడా లెఫ్టి నెంట్ గవర్నర్ గా ఉన్న తమిళిసై..తెలంగాణలో జెండా వందనం తర్వాత పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ తమిళ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. కరోనా పేరుతో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని.. అదే కేసీఆర్ ఐదు లక్షల మందితో సభ నిరవహించారని తమిళిసై గుర్తు చేశారు. ఈ విషయాలన్నింటిపై కేంద్రానికి నివేదిక పంపించానని ప్రకటించారు. మరో వైపు హైదరాబాద్‌ రాజ్ భవన్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నేరుగా ప్రభుత్వం విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ ల గురించి మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ నేతలు.. గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవి గీత దాటుతున్నాయి.

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో పాటు.. రాజ్యాంగ పరంగా నిర్వర్తించాల్సిన విధులను ప్రభుత్వం నిర్వహించడం లేదని.. గవర్నర్ కు ప్రోటోకాల్ కూడా కల్పించడం లేదన్న ఆరోపణలు బీజేపీ వైపు నుంచి వస్తున్నయి. ఈ క్రమంమలో గవర్నర్ .. కేంద్రానికి నివేదిక పంపించానని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని కేంద్రం సీరియస్‌గా తీసుకుంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close