మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకును వెంటాడుతున్న హిట్ అండ్ ర‌న్ కేసులు

బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసులో తవ్విన‌కొద్దీ నిజాలు బ‌య‌ట‌కొస్తూనే ఉన్నాయి. ఓ కేసులో తీగ‌లాగితే గ‌తంలో జ‌రిగిన కేసుల్లో త‌ను త‌ప్పించుకున్న తీరు బ‌య‌ట‌కు రావ‌టంతో పాత కేసుల‌ను కూడా పోలీసులు రీఓపెన్ చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు మ‌ద్యం మత్తులో ప్ర‌జా భ‌వ‌న్ ముందు బారీకేడ్ల‌ను ఢీకొట్టి వెళ్లిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేశాక‌, ష‌కీల్ కొడుకు రాహెల్ ప్లేసులో మ‌రొక‌రిని స‌రెండ‌ర్ చేసి వెళ్లారు. ఇదంతా పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ సీసీ కెమెరాల‌తో పాటు దాడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో హైద‌రాబాద్ సీపీ సీరియ‌స్ అయి, పంజాగుట్ట స్టేష‌న్ సిబ్బందిని మొత్తం మార్చేశారు. ఆఫీస‌ర్ల‌ను అరెస్ట్ కూడా చేశారు.

అయితే, దుబాయ్ పారిపోయిన రాహెల్ ఇటీవ‌లే హైద‌రాబాద్ వ‌స్తూ పోలీసుల‌కు చిక్కాడు. దీంతో కేసు ద‌ర్యాప్తు స‌మ‌యంలో పోలీసుల‌కు గ‌తంలో జూబ్లీహిల్స్ లో జ‌రిగిన హిట్ అండ్ ర‌న్ కేసులో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పడ్డాయి.

రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో హిట్ అండ్ ర‌న్ కేసు న‌మోదైంది. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను ఓ కారు ఢీకొట్టింది. దీంతో కాజోల్ చేతిలో ఉన్న రెండు నెలల శిశువు కింద ప‌డిపోయి, అక్క‌డికక్క‌డే మృతిచెందాడు. కాజోల్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డింది. ప్ర‌మాదం జ‌ర‌గ్గానే ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డి నుండి పరార‌య్యారు. అయితే, ఆ వాహ‌నంపై ఎమ్మెల్యే ష‌కీల్ స్టిక్క‌ర్ ఉండ‌టంతో పోలీసులు విచార‌ణ చేయ‌గా, కొడుకు రాహెల్ అందులో లేడ‌ని అబ‌ద్దం చెప్పించి మ‌రో వ్య‌క్తి లొంగిపోయారు. పోలీసులు కూడా ఆ కేసును అక్క‌డితో అప్ప‌ట్లో ముగించారు. కానీ ఇప్పుడు ఆ కేసును బ‌య‌ట‌కు తీసి విచారిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close