దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని రూపుమాపామని, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియాతో ఎంతో ప్రగతి సాధించామంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

దేశంలో నాణ్యమైన ఆహరం దొరక్క ఏడాదికి 17 లక్షల మంది చనిపోతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ…భారత్ ను నిరుద్యోగ భారతవనిగా మార్చారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 30లక్షల ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఏమాత్రం కేంద్రం ఆసక్తి చూపడం లేదు.

ఫలితంగా పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ కన్నా దారుణమైన నిరుద్యోగం రేటు భారత్ లో ఉన్నది. దేశంలో 22.32శాతం నిరుద్యోగ రేటు ఉన్నది. నేషనల్ క్రైం రికార్డ్స్ ప్రకారం.. 2014లో నిరుద్యోగుల ఆత్మహత్యల శాతం 7.5గా ఉంటే 2023 నాటికి 10 శాతాన్ని మించిపోయింది. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక 5 లక్షల చిన్న, మధ్య తరహ పరిశ్రమలు మూతపడగా, లక్షలాది మంది ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళారు.

ఇండియాలో వైద్యరంగం పెద్ద బిజినెస్ గా మారడం పేదలకు శాపంగా మారింది. ఫలితంగా ఎంతోమంది పేదలు సరైన వైద్యం అందక చనిపోతున్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం.. వైద్య సదుపాయాల మీద జాతీయాదాయంలో ఖర్చు పెడుతున్నది కేవలం 1% మాత్రమే కావడం గమనార్హం.

ఏటా యూఎన్ డీపీ మనవాభివృద్ది సూచీ (హెచ్ డీ ఐ ) నివేదికను బహిర్గతం చేస్తుంటుంది. 2015లో 188 దేశాల్లో ఇండియా ర్యాంక్ 130ఉండగా… 2022 -23 నాటికీ 132ర్యాంక్ కు చేరిందంటే.. పదేళ్ళ బీజేపీ పాలనలో ఏం అభివృద్ధి జరిగినట్లు..? పని తక్కువ… ప్రచారం ఎక్కువ చేసుకోవడంతోనే ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close