జగన్‌ “మడమ తిప్పే” సలహాల సూత్రధారి సజ్జలేనా !?

ప్రభుత్వం తరపున ఆయనే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి తరపున కూడా ఆయనే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి అవగాహన ఉందో లేదో కూడా ఆయనే చెబుతున్నారు. ఉద్యోగులూ ఆయననే సీఎంగా చూస్తున్నారు. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి గురించే. ఏపీ ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న యాభై మందికిపైగా సలహాదారుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. మిగతా సలహాదారులెవరూ తెర ముందు కనిపించరు కానీ సజ్జల మాత్రం ఠంచన్‌గా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మీడియా సమావేశాలు ఎంత తరచుగా పెడతారో .. ఇప్పుడు తాను అంత తరచుగా పెడుతున్నారు.

జగన్‌కు అవగాహన లేదని చెప్పి ప్రజల్లో చులకన చేస్తారా !?

అన్ని అంశాలపై మాట్లాడుతున్నారు. ఓ ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలనూ ఆయనే చెబుతున్నారు. ఈ అంశంపై చాలా రోజులుగా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రికి అవగాహన లేదన్న విషయం కూడా ఆయనే చెబుతున్నారు. సీపీఎస్ రద్దు విషయంలో చేతులెత్తేయాలని నిర్ణయించుకున్న సజ్జల దానికి తార్కికమైన ముగింపు కోసం ముఖ్యమంత్రిని బకరాను చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే జగన్‌కు అవగాహన లేదని అసువుగా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఇది ప్రజల్లోఎంత దారుణమైన నెగెటివ్ ఇంప్రెషన్‌ జగన్ పై తెస్తుందో సజ్జలకు తెలియనిదేం కాదు.కానీ ఆయన అనేశారు.

ప్రతిపక్షంలో ఓకే అన్నవి ఇప్పుడు నో.. అప్పుడు నో అన్నవి ఇప్పుడు ఓకే..! ఈ సలహాలు సజ్జలవేనా ?

ఈ ఒక్కఅంశంలోనే కాదు… జగన్ తీసుకుంటున్న యూటర్న్ నిర్ణయాల్లో సజ్జల సలహాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించడం… అధికారంలోకి రాగానే అవే నిర్ణయాలు తీసుకోవడం రెండున్నరేళ్లుగా జరిగాయి. అదే సమయంలో అమరావతి వంటి విషయాల్లో ప్రతిపక్షంలో ఉండి స్వాగతించి ఇప్పుడు .. వ్యతిరేకించారు. ఇలాంటి యూటర్న్ నిర్ణయాలతో జగన్‌కు ప్రజల్లో మడమ తిప్పుడు ఇమేజ్ వచ్చేసింది. మాట తప్పం.. మడమ తిప్పం అనే ఓ బ్రాండ్‌ను ప్రచారం చేసుకున్ని అన్ని విషయాల్లో వెనక్కి తగ్గితే పోయేది పరువే. ఆ విషయం సజ్జలకు తెలియనిదేమీ కాదు.

జగన్ ఇమేజ్‌ను ప్లాన్డ్‌గా డ్యామేజ్ చేస్తున్న సలహాదారు సజ్జల !?

జర్నలిస్టు అయిన సజ్జల సాక్షిలో ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండేవారు. అక్కడ్నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. వైఎస్ ఉన్నప్పుడు ఆయనకు బదులుగా కేవీపీ ఎలా చక్రం తిప్పేవారో.. ఇప్పుడు సజ్జలది ఆ పాత్ర. కానీ కేవీపీ ఎప్పుడూ తెర ముందుకు రావాలనుకోలేదు. కానీ సజ్జల తెర ముందుకు వస్తున్నారు. జగన్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నారు. సీఎం తరపున ప్రకటనలు చేసి ఆయనను బకరాను చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకూ అర్థం కావడంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close