జగన్ ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ ఇంత డొల్లనా ?

జగన్ హెలికాప్టర్లో వస్తున్నారంటే కింద ట్రాఫిక్ అపేస్తారు . రోడ్ యాత్ర అంట్ చెట్లు కొట్టేస్తారు. అంతకు మించి ఆయన తనకు.. తన కుటుంబానికి.. విదేశాల్లో కూడా భద్రత కల్పించేలా ప్రత్యేక సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబుకు కమెండోల రక్షణ ఉందని.. తనకూ అలాంటిది కావాలన్న ఉద్దేశంతో… స్పెషల్ డ్రెస్సులు కూడా డిజైన్ చేయించి వారి మధ్యనే పర్యటిస్తున్నారు. అయినా విజయవాడలో గులకరాయిపడింది.

సీఎంగా జగన్ తనకు.. తన కుటుంబానికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునేముందే … సీఎంకు హై రేంజ్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన రోడ్డు మీదకు రావాలంటే.. మొత్తం ఇంటలిజెన్స్ పోలీసులు ముందుగానే జనంలోకి కలిసిపోయి.. ఎవరైనా నిరసనలు చేస్తారేమో చూస్తారు. వారిని పట్టుకుంటారు. రాళ్లేసేవాళ్లుంటే అలక్ష్యం చేయరు.తర్వాత రోప్ పార్టీ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. సీఎం భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. అయినా గులకరాయి పడింది.

సీఎం జగన్ సాధారణంగా బస్సు టాప్ పై ఎక్కరు. రెండు, మూడు వందల మంది జనాన్ని తీసుకు వచ్చినా ఆయన తన సీట్లో నుంచి.. చిద్విలాసంగా నమస్కారం చేస్తారు. నైట్ కరెంట్ ఆపేసి చేసిన రోడ్ షోలో అయితే.. అసలు బ యటకు రాకూడదు. అది సెక్యూరిటీ ప్రోటోకాల్ కూడా. ముఖ్యమంత్రి స్వయంగా తన భద్రత కోసం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా.. గులకరాయి వచ్చి పడిందంటే ఇంత కంటే చేతకాని తనం ఉన్న ప్రభుత్వం వ్యవస్థ ఉండదేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close