ఒక సీన్ – 47 టేకులు… జ‌గ్గూభాయ్ స్వీట్ రివైంజ్‌

సెట్లో ద‌ర్శ‌కుడికీ, న‌టీన‌టుల‌కు మ‌ధ్య కెమిస్ట్రీ చాలా అవ‌స‌రం. డైరెక్ట‌ర్ ఏం చెబుతున్నాడ‌ది ఆర్టిస్టుల‌కు, ఆర్టిస్టుల‌తో పెర్‌ఫార్మెన్స్ ఎలా తీసుకురావాల‌న్న‌ది ద‌ర్శ‌కుల‌కు తెలియాల్సిందే. ఈ రెండింటో ఏది లేక‌పోయినా, మిస్ క‌మ్యునికేష‌న్ జ‌రుగుతుంది. దాంతో సెట్లో అంతా గంద‌ర‌గోళ‌మే. ఇలాంటి ఓ సంద‌ర్భ‌మే.. ‘ఫ్యామిలీస్టార్‌’ సినిమా సెట్లో ఎదురైంది.

ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు ఓ చిన్న‌ పాత్ర పోషించారు. ఆయ‌న క‌నిపించింది రెండు మూడు సీన్లే. అయితే ఓ సీన్ కోసం ఏకంగా 47 టేకులు తీసుకొన్నార‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. జ‌గ‌ప‌తిబాబు పెద్ద‌గా టేకులు తినేసి, ఇబ్బంది పెట్టే న‌టుడు కాదు. మెథ‌డ్ యాక్టింగ్ అస్స‌లు తెలీదు. ఒక‌టి, రెండు టేకుల్లో సీన్ పూర్త‌యిపోతుంది. కానీ త‌న కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా 47 టేకులు తీసుకోవ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే. అలాగ‌ని అదేదో.. అరివీర‌భ‌యంక‌ర‌మైన పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సీన్‌కాదు. చాలా మామూలు సీనే. అయినా ఇన్ని టేకులు ఎందుకు అవ‌స‌రం అయ్యాయి?

ఎందుకంటే.. ఇదంతా జ‌గ‌ప‌తి బాబు ద‌ర్శ‌కుడిపై తీర్చుకొన్న స్వీట్ రివైంజ్‌. సెట్లో సీన్‌కి సంబంధించిన ఏదో డౌట్ ఉంటే, ప‌ర‌శురామ్‌తో చ‌ర్చిస్తున్న‌ప్పుడు ఆయ‌నేదో వెట‌కారంగా మాట్లాడార‌ట‌. దాంతో.. జ‌గ్గూభాయ్‌కి కోపం వ‌చ్చింది. అదంతా.. టేకులు తినేస్తూ తీర్చేసుకొన్నారు. పావుగంట‌లో పూర్త‌వ్వాల్సిన షాట్… ఒక్క పూట‌కు గానీ పూర్త‌వ్వ‌లేదు. క‌క్క‌లేక మింగ‌లేక‌.. ప‌ర‌శురామ్ మోనేట‌ర్ ముందు కూర్చుని ‘వ‌న్ మోర్‌’ చెప్పుకొంటూ వెళ్లిపోయాడు. చివ‌రికి జ‌గ్గూభాయ్‌కే విసుగొచ్చి, ఆ సీన్ ప‌ర్‌ఫెక్ట్‌గా చేసేసి, త‌ప్పుకొన్నారు. సీనియ‌ర్ ఆర్టిస్టుల‌తో పెట్టుకొంటే, ఇలానే ఉంటుంది మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close