మోదీ “అమృత్‌”కి కేసీఆర్ “సప్తాహ” కౌంటర్ !

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాజకీయంగా తాడో పేడో తేల్చుకుంటున్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పాటించడానికి సిద్ధంగా లేరు. అయితే కొన్ని చేయక తప్పదు. అలా చేయాల్సి వచ్చినవి సొంత ముద్రతో చేస్తున్నారు. తాజాగా మోదీ ” అజాదీ కా అమృత్ మహోత్సవ్” పేరుతో వేడుకలు నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. కానీ కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. కేంద్రంతో సంబంధం లేకుండా.. కొత్తగా “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ ” పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నారు.

దీనిపై కేసీఆర్ సమీక్ష చేశారు. ఇంకా మోదీ డీపీ విధానానికి కూడా కౌంటర్ ఇస్తున్నారు. అందరూ సోషల్ మీడియా డీపీలుగా జాతీయ జెండా పెట్టుకోవాలని మోదీ పిలుపనిచ్చారు. దీనికి కౌౌంటర్‌గా ద్విసప్తాహం నిర్వహణకు ప్రత్యేక చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. జాతీయ చిహ్నంలోని అశోకచక్రం, రాష్ట్ర అధికారచిహ్నంలోని కాకతీయతోరణం, త్రివర్ణపతాకం మిళితమయ్యేలా దీనిని తయారు చేశారు. నెలాఖరు వరకూ దీన్నే వాడాలని ప్రభుత్వం సూచించనుంది.

అన్ని రాష్ట్రాలు అజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరుతోనే నిర్వహిస్తున్నాయి. కానీ తెలంగాణ సర్కార్ పేరు మార్చి కేంద్రం ఊసు లేకుండా సొంతంగా నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ఓ లోగో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించడం.. దాన్నే సోషల్ మీడియా డీపీలుగా పెట్టుకోవాలని సూచించే చాన్స్ ఉండటంతో కేంద్రానికి పోటీగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాల్లోనూరాజకీయం చేస్తారా అనే విమర్శలకు.. అసలు మోదీనే రాజకీయం చేస్తున్నారనే కౌంటర్ టీఆర్ఎస్ దగ్గర రెడీగా ఉంటుంది. అందులో సందేహం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close