హ‌రీష్‌కు ఓకే చెప్పిన ఆ స్టార్ హీరోలెవ‌రు?

ఒకేసారి రెండు సినిమాల‌తో బిజీ అయిపోయాడు హ‌రీష్ శంక‌ర్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తీస్తున్న ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌’కి గ్యాప్ రావ‌డంతో ర‌వితేజ‌తో `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌`ని ప‌ట్టాలెక్కించేశాడు. ఈగిల్ స‌క్సెస్ మీట్ లో హ‌రీష్ మాట్లాడుతూ త్వ‌ర‌లోనే ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో సినిమా చేస్తున్నాను, ఆ డిటైల్స్ కూడా రాబోతున్నాయి అంటూ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇద్ద‌రు హీరోలెవ‌రు? అనే ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న మొద‌లైంది.

ఇందులో ఓ హీరో మెగాస్టార్ చిరంజీవి అని టాక్‌. చిరు – హ‌రీష్‌లు క‌లిస్తే ఆ కాంబో క్రేజీగా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాజెక్ట్ సైతం పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీలో ఫిక్స‌య్యే ఛాన్సుంది. చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఎప్ప‌టి నుంచో అనుకొంటోంది. ఇప్పుడు ఆ సంస్థ‌లోనే ర‌వితేజ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌’ చేస్తున్నాడు. సో.. ఈ కాంబో అలా కుదిరేసింది. మ‌రో సినిమా.. ఎవ‌రితో అనేది తేలాల్సివుంది. ఈసారి ఓ యువ హీరోతో హ‌రీష్ జ‌ట్టు క‌ట్టే అవకాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల్ని హ్యాండిల్ చేయ‌గ‌లిగే ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ ఒక‌డు. త‌న‌తో సినిమాలు చేయ‌డానికి హీరోలంతా సిద్ధ‌మే. అయితే.. వాళ్లంతా బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌తీ స్టార్ హీరో చేతిలోనూ రెండు మూడు ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఇంత బిజీలో హ‌రీష్‌కు డేట్లు ఇవ్వ‌డం మామూలు విష‌యం కాదు. `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌` సెట్స్‌పై ఉండ‌గానే ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డానికి సిద్ధంగా ఉన్నాడు హ‌రీష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close