డబ్బులు ఎగ్గొట్టిందని ఏపీ సర్కార్‌పై కోర్టుకెళ్లిన మహింద్రా

వాహనాలు కొన్నారు. వాడుకుంటున్నారు. సీఎం జగన్ రెండున్నరేళ్ల కిందటే.. గొప్పగా జెండా ఊపారు. కానీ ఇప్పటి వరకూ ఆ వాహనాల డబ్బులు చెల్లించలేదు. వాహనాలు ఇచ్చిన మహింద్రా కంపెనీ అడిగి అడిగి విసుగుపుట్టి కోర్టుకెళ్లింది. అంతేనా టెండర్లు ఖరారు చేసేందుకు ఉన్న గవర్నమెంటు ఈ మార్కెట్‌ ప్లేస్‌ పోలీస్‌శాఖను బ్లాక్‌ లిస్టులో పెట్టింది.

జగన్ రెడ్డి దిశ పేరుతో చేసిన ప్రచార ఆర్భాటం అందరికీ గుర్తుండే ఉంటుంది. దిశ పోలీసు స్టేషన్లకు, పోలీసు అధికారుల కోసం 2022 జనవరిలోనే 163 బొలేరో వాహనాలను మహీంద్ర అరడ్‌ మహీంద్ర సంస్థ నుంచి కొనుగోలు చేశారు. రెండు విడతలుగా కొనుగోలు చేసిన ఈ వాహనాలకు రూ.14.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2022 జనవరిలో కొనుగోలు చేసిన ఈ వాహనాలను ముఖ్యమంత్రి అదే ఏడాది మార్చి 23న ప్రారంభించి దిశ పోలీసు స్టేషన్లకు అందించారు. ఈ వాహనాలకు సంబంధించిన వారంటీ కూడా చివరి దశకు వస్తున్నప్పటికీ బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు.

ప్రభుత్వ ఈ-మార్కెట్‌ ప్లేస్‌ నిబంధనల మేరకు ఏపీ పోలీస్‌శాఖ బ్లాక్‌ లిస్టులోకి చేరుకుంది. దీనివల్ల ఈజీఎం ద్వారా కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖకు అవకాశం లేకుండా పోయింది. వాహనాలకు బిల్లులు రాకపోవడం, నిబంధనలను ఉల్లంఘించడంతో మహీంద్ర సంస్థ కోర్టును ఆశ్రయించింది. అలాగే కొనుగోళ్లపై ఒప్పందం కుదిరిన నాటి నుంచి 12 శాతం వడ్డీతో తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. బకాయిలకు 12 శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close