దత్తన్న మంత్రి పదవి డౌటేనా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జులై మొదటి వారంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మూడు అంశాల ప్రాతిపదికన మార్పులు, చేర్పులు చేయబోతున్నారు. ఒకటి- పనితీరు సరిగా లేని మంత్రులను తొలగించడం. రెండు- కొందరు మంత్రులను తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించడం. మూడు- వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వీలైనంత మందిని కేబినెట్లోకి తీసుకోవడం.

ఈ ప్రాతిపదికన మంత్రివర్గం కూర్పు ఉండబోతోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో దీనిపై మోడీ చర్చించారని తెలుస్తోంది. న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు ఉద్వాసన తప్పక పోవచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించాలని మోడీ, అమిత్ షా భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ వాణిని బలంగా వినిపించడం, జాతీయ చానళ్లలో విపక్షాల దాడిని తిప్పికొట్టడానికి ఆమెకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారట.

ఇలా మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే వారి జాబితాలో సికింద్రాబాద్ ఎంపీ, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై అమిత్ షా సీరియస్ గా ఉన్నారు. గత రెండేళ్లుగా తెలంగాణలో పార్టీని మెరుగుపరచడానికి జరిగిందేమీ లేదని ఆయన భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి సమర్థంగా పనిచేయలేదన్నది అమిత్ షా అభిప్రాయం. ఇప్పుడు ఆయన స్థానంలో లక్ష్మణ్ ను నియమించారు. అయితే ఆయన తనదైన శైలిలో పనిచేస్తూ పార్టీని గాడిలో పెట్టడానికి కొంత సమయం పట్టవచ్చు.

తెలంగాణలో పార్టీకి ఊపు రావాలంటే సీనియర్ నేతలు గట్టి ప్రయత్నం చేయాలని ఇప్పటికే అమిత్ షా ఉద్బోధించారు. అయినా పెద్దగా మార్పు లేదని ఆయన నిరాశతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, వచ్చే నెల మొదటి వారంలో జరిగే మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో దత్తాత్రేయ మంత్రి పదవి అలాగే ఉంటుందా లేక మార్పు జరుగుతుందా అనేది చర్చనీయాంశమైంది.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఒక కేంద్ర మంత్రి ఉండాలనేది ఒక వాదన. బలమైన బీసీ నేతగా గుర్తింపు ఉన్న అలాంటి వ్యక్తిని, మాస్ లీడర్ ను పార్టీ బాధ్యతల కోసం ఉపయోగించు కోవాలనేది మరో వాదన. ఇంతకీ దత్తన్న మంత్రిగా కొనసాగుతారా లేదా అనేది జులై మొదటి వారంలో తెలిసిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close