మోదీ విశాఖలో శంకుస్థాపన చేసేది జోన్‌కు కాదు స్టేషన్‌కు !

నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఆయన వస్తున్న ప్రధాన కార్యక్రమం .. విశాఖలో రూ. నాలుగు వందల కోట్లతో నిర్మించబోతున్న ..లేదా ఆధునీకకరించబోతున్న రైల్వేస్టేషన్ పనులకు శంకుస్థాపన చేయడం కోసం. అంటే ఇప్పుడు ఉన్న రైల్వే స్టేషన్ భవనం స్థానంలో కొత్తది నిర్మిస్తారు. అయితే వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మాత్రం .. రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయబోతున్నారన్న ప్రచారం చేస్తున్నారు. కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను ఎడిట్ చేసి రైల్వే స్టేషన్ స్థానంలో జోన్ అనే అక్షరాలు పెట్టి మభ్య పెట్టాలనుకుంటున్నారు.

రైల్వే జోన్ అంశానికి కేంద్ర కేబినెట్ ఎప్పుడో ఆమోదం తెలిపింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాన్ని జోన్ అమలు చేయాలని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు.కనీస మాత్రంగా కూడా అడగలేదు. పలుమార్లు కేంద్రం జోన్ విషయంలో వ్యతిరేక ప్రకటనలు చేసినా ఢిల్లీలో స్పందించలేదు. ఏపీకి వచ్చి జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ప్రకటించారు. కానీ ఈ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రధానమంత్రి వస్తున్నా.. జోన్ కోసం కాదు. కానీ వైసీపీ నేతలు మాత్రం జోన్ కోసమేనని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

బోగాపురం ఎయిర్ పోర్టుకు టీడీపీ హయాంలోనే టెండర్లు పూర్తయ్యాయి. పనులు కొనసాగించి ఉంటే ఈ సారి సగానికి పైగా నిర్మాణం పూర్తయ్యేది. కానీ టెంజర్లు రద్దు చేసి.. భూములను తగ్గించి మళ్లీ పాత కాంట్రాక్టర్ జీఎంఆర్‌కే ఇవ్వడంతో కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ అనుమతులు ఇంకా లేదు. ప్రధాని విశాఖకు వస్తున్నా.. ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయకపోతే.. వైసీపీ ప్రభుత్వానికి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close